వైసిపి కార్యకర్తలను చిత్రహింసలు పెడుతున్న టిడిపి నేతలు.. లోకేష్ కి తెలిస్తే వేటు తప్పదా..?

Divya
ఆంధ్రప్రదేశ్లో టిడిపి పార్టీ అధికారంలోకి రాగానే వైసిపి నేతల మీద కార్యకర్తల మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఉన్నారు.. గత రెండు మూడు రోజుల నుంచి ఈ దాడులు మరింత ఎక్కువగా మారుతున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా వైసీపీ కార్యకర్త పాలేటి రాజ్ కుమార్ ని టిడిపి నేతలు చుట్టూ ముట్టి మరి బట్టలు ఊడదీసి నడిరోడ్డు పైన కూర్చోపెట్టి చాలా విచిత్రహింసలు పెడుతున్నట్లుగా కనిపిస్తోంది.ముఖ్యంగా మోకాలిపై నిలబెట్టి మరి ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు.

అంతేకాకుండా చేతులెత్తి మరీ లోకేష్ కి క్షమాపణలు చెప్పేలా చేయడంతో ఈ విషయం చూసిన చాలా మంది నేతలు కార్యకర్తలు ప్రజలను కూడా మనసు కదిలించేలా ఉన్నది.. టిడిపి నేతలు అరాచకం రోజురోజుకి పెరుగుతోందంటూ ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. పాలేటి రాజకుమార్, కృష్ణవేణి భార్యాభర్తలు ఇద్దరు కూడా మంగళగిరి నియోజవర్గం తరఫున వైసీపీ పార్టీ నుంచి యాక్టివ్ గా ఉండేవారు. నేరుగా జగన్ ని కలిసి ఫోటోలు కూడా దిగడం జరిగింది. మంగళగిరిలో లోకేష్ కి వ్యతిరేకంగా పనిచేయడంతో పాటు సోషల్ మీడియాలో కూడా పలు రకాల పోస్ట్లు షేర్ చేసేవారు.

అంతేకాకుండా ఈ ఫోటోలు చూసిన టిడిపి నేతలు వీరిపైన ప్రతీకారం తీర్చుకోవాలని ఎన్నోరోజులుగా ఎదురు చూస్తున్నారు. టిడిపి పార్టీ అధికారంలోకి రాగానే ఇలాంటివి అడ్డు అదుపు లేకుండా చేస్తున్నారు.. చంద్రబాబు, లోకేష్ పవన్, కళ్యాణ్ వంటి వారు తాము ప్రతికార రాజకీయాలకు పాల్పడడం అంటూ చెప్పినప్పటికీ నేతలు మాత్రం ఇలాంటి దాడులు చేస్తూ ఉన్నారు. ఈ విషయాల పైన వైసిపి నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు అసలు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా అనే విధంగా కూడా అడుగుతున్నారు. పోలీసులు టిడిపికి వోత్తాసు పలుకుతూ వైసిపి నేతలను కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. మరి ఈ విషయం లోకేష్ కి తెలిస్తే అటు ఇలాంటి పని చేసిన కార్యకర్తల పైన వేటు ఉంటుందా అనే విధంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇలా చేస్తే రాబోయే రోజుల్లో కచ్చితంగా కూడా టిడిపి పార్టీకి దెబ్బ పడుతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: