అప్పుడు బిఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్.. కిషనన్నను టచ్ కూడా చేయలేదు?
ఎందుకంటే ఇప్పుడు బిఆర్ఎస్ ప్రతిపక్ష హోదా లో ఉంటే అధికారంలో కాంగ్రెస్ ఉంది. ఇక ఈ సమయంలో ఎప్పటిలాగానే సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కూడా కారు పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. అయితే ఎప్పటిలాగానే అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరికి పార్లమెంట్ ఎన్నికల్లో మరొకరికి సికింద్రాబాద్ ఓటర్లు పట్టం కడతారా అనే విషయంపై ఉత్కంఠ నెలకొనగా.. అందరూ అనుకున్నదే జరిగింది. పాత సెంటిమెంట్ రిపీట్ అయింది. కాషాయ పార్టీ హ్యాట్రిక్ కొట్టేసింది.
ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరో సారి ఘన విజయాన్ని అందుకున్నారు. బిఆర్ఎస్ తరఫున స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, కాంగ్రెస్ తరపున హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీ చేసిన అటు కిషన్ రెడ్డి గెలుపును మాత్రం ఆప లేకపోయారు. ఈ క్రమం లోనే వరుసగా రెండో సారి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లో విజయం సాధించగా.. ఇక బిజెపికి ఇక్కడ ఇది హ్యాట్రిక్ కావడం గమనార్హం. ఏకంగా 65 పైసలుకు ఓట్ల మెజారిటీ తో బిఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ విజయం సాధించారు కిషన్ రెడ్డి.