సేమ్ డేట్.. కానీ, సీమ్ ఛేంజ్!! ఆయన అమరావతిలో ప్రమాణస్వీకారం..?

Divya
ఆంధ్రప్రదేశ్లోని గత నెల 13 వ తేదీన ఓటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యింది. ఈ రోజున ఓటింగ్ ఫలితాలు వెలబడునున్నాయి.. ముఖ్యంగా ఓటింగ్ సరళిని చూసి భారీగానే పోలింగ్ అవ్వడంతో అధికార పార్టీ వైసిపి నే అధికారం మరొకసారి దక్కించుకుంటుందని ధీమాతో ఉన్నారు. కానీ కూటమి కూడా ఈసారి తమదే అధికారం అనేది ధీమాతో ఉన్నారు.అంతేకాకుండా ఇరువురు పార్టీ నేతలు కూడా ప్రమాణస్వీకారం చేయడానికి తేదీలను కూడా ఫిక్స్ చేశారు. అయితే ఇప్పుడు ఫలితాలు ఏకంగా టిడిపి పార్టీకి అనుకూలంగా ఉండడంతో ఒక్కసారిగా వైసిపి నేతలు కంగుతిన్నారు.

గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈసారి అధికారంలోకి వస్తే విశాఖపట్నంలో ప్రమాణస్వీకారం చేస్తానని కూడా తెలియజేశారు. అయితే టిడిపి నేత మాత్రం తాను గెలిస్తే అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తానని తెలియజేశారు. ఈనెల తొమ్మిదవ తేదీన ప్రమాణ స్వీకారం జగన్ చేస్తారంటూ వైసీపీ నేతలు తెలియజేశారు.. తాజాగా ఇప్పుడు సేమ్ డేట్ కి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా టిడిపి నేతలలో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.

వైసీపీ నేతలు చేసుకున్నటువంటి ఈ డేట్ ని ఇప్పుడు తాము ఆక్రమించుకుంటున్నామంటూ కూడా ఎద్దేవ చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పథకాలు ప్రజలలోకి బాగా వెళ్లాయని అందుకే తామ అధికారంలోకి చేపడుతున్నామని అంతేకాకుండా జగన్ ప్రజలకు చాలా భారంగా మారారని చాలామంది టిడిపి నేతలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ పార్టీ 18 స్థానాలలో లీడులో ఉంది కానీ జనసేన పార్టీ 20 స్థానాలలో లీడ్ లో ఉండడంతో జనసేన కార్యకర్తలు నేతలు కూడా తీవ్రమైన స్థాయిలో వైసీపీ పార్టీని విమర్శిస్తున్నారు.. గతంలో వై నాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయికి పడిపోవడానికి ముఖ్య కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని తమ నేతలు తెలియజేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: