రిపబ్లిక్ టీవీ,రిపబ్లిక్ మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే!

Purushottham Vinay
రిపబ్లిక్ టీవీ,రిపబ్లిక్ మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు... 

దేశం మొత్తం కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం రానే వచ్చేసింది. జూన్ 1వ తేదీన అనగా ఈరోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు (Exit Poll Results) రానే వచ్చేశాయి. రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ ని గనుక గమనిస్తే... మూడోసారి కూడా అధికారిక జాతీయ పార్టీ అయిన బీజేపీ నేతృత్వంలోనే ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో ఘనవిజయం సాధిస్తుందని, కేంద్రంలో అధికారంలోకి రానుందని రిపబ్లిక్ టీవీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ 359 స్థానాల్లో గెలుస్తుందని ఆ ఏజెన్సీ తెలిపింది.

ఇక ఇండియా కూటమికి కేవలం 159 సీట్లు మాత్రమే వస్తాయని, ఇతర పార్టీలు 30 దాకా సీట్లు సొంతం చేసుకుంటాయని ఆ సర్వే పేర్కొంది. ఎప్పట్లాగే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ చక్రం తప్పిందని.. దక్షిణాదిలో తన ప్రభావం పెద్దగా లేకపోయినప్పటికీ, గతంతో పోలిస్తే చెప్పుకోదగ్గ స్థానాల్లో బీజేపీ నెగ్గిందని ఆ సర్వే వెల్లడించింది. ఏదేమైనా కూడా ముందు నుంచి చెప్తున్నట్టు బీజేపీ ఈసారి అఖండ విజయాన్ని సొంతం చేసుకోబోతోందని రిపబ్లిక్ టీవీ జోస్యం చెప్పింది.

రిపబ్లిక్ మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ ని గనుక గమనిస్తే...రిపబ్లిక్ మ్యాట్రిజ్ కూడా ఎన్డీఏదే అధికారమని తెలిపింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ 353-368 మేర సీట్లు సొంతం చేసుకుంటుందని ఆ సంస్థ పేర్కొంది. కానీ.. ఇండియా కూటమికి కేవలం 118-133 స్థానాలు వస్తాయని.. ఇతర పార్టీలు 43-48 స్థానాల్ని సొంతం చేసుకుంటాయని వెల్లడించింది. తాము చెప్పినట్లుగానే.. బీజేపీ గతంతో కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొంది, అధికారంలోకి రానుందని చెప్పుకొచ్చింది.

రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ ని గనుక గమనిస్తే...
1.ఎన్డీఏ - 359
2.ఇండియా - 159
3.ఇతరాలు - 30
రిపబ్లిక్ మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ ని గనుక గమనిస్తే...
1.ఎన్డీఏ - 353-368
2.ఇండియా - 118-133
3.ఇతరాలు - 43-48

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: