వైసీపీ విక్టరీ: భారీ మెజారిటీతో జగన్ గెలుపు పక్కా?

Purushottham Vinay
•ఆంధ్రాలో వైసీపీ గెలుపు ఖాయం
 
•భారీ మెజారిటీతో జగన్ సీఎం కావడం పక్కా

ఆంధ్రప్రదేశ్ లో జూన్ 4న వెలువడబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఆసక్తి కొనసాగుతోన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో విజయం పై ఎవరి ధీమాలో వారున్నారు.ముఖ్యంగా వైసీపీ నేతలైతే చాలా నమ్మకంగా ఉన్నారు. గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తాలు ఫిక్స్ చేస్తున్నారు. ఏపీలో ఎన్నికల ఫలితాలపై వైసీపీ పూర్తి ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి వేసిన లెక్కలపై ఆసక్తికరమైన విషయం తెరపైకి వచ్చింది. పోలింగ్ తరువాత రెండు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి వివరాలను సేకరించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఎక్కడ ఏ వర్గం ఓట్లు వైసీపీకి ఎలా పోల్ అయ్యాయనే విషయంపై సీఎం జగన్ తీవ్ర కసరత్తు చేశారు.ఇదే క్రమంలో విదేశీ పర్యటనకు ముందు ఐప్యాక్ టీం తోనూ సమావేశమయ్యారు సీఎం.ఈ సందర్భంగా 2019 కంటే ఎక్కువ సీట్లలో వైసీపీ విజయం సాధిస్తుందని జగన్ ధీమాగా చెప్పారు. అంటే 175 సీట్లలో 151 కంటే ఎక్కువన్నమాట.

ఇదే క్రమంలో ఎంపీ సీట్లు కూడా ఏకంగా 22 దాటుతాయని విశ్వాసం వ్యక్తం చేసారు.ఈ సందర్భంగా పలువురు నేతలు ఈ నెంబర్ విషయంలో జగన్ తో ఏకీభవిస్తూ నమ్మకంగా ఉన్నారు. 150 ప్లస్ అంటూ ధీమాగా ఉన్న జగన్... ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నా పలువురు కీలక నేతలతో మాట్లాడినట్లు తెలుస్తుంది. విదేశీ పర్యటనలో ఉన్న జగన్ పార్టీ ముఖ్యలతో మాట్లాడారని తెలుస్తుంది. ఇందులో భాగంగా.. తాను చెప్పిన నెంబర్ రాబోతోందని మరోసారి స్పష్టం చేసారు జగన్. జూన్ 1 వ తేదీన వచ్చే ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నప్పటికీ జూన్ 4న వచ్చే ఎగ్జాట్ పోల్స్ మాత్రం తమవైపే అనుకూలంగా ఉంటాయని ధీమాగా చెబుతున్నారని తెలుస్తుంది. మహిళలు, వృద్ధులు, బడుగు బలహీన వర్గాల వారు పూర్తిగా తమవైపే ఉన్నారని జగన్ మోహన్ రెడ్డి నమ్ముతున్నారు. అలాగే ఇండియా హెరాల్డ్ చేసిన సర్వే ప్రకారం ఈసారి కూడా వైసీపీ భారీ మెజారిటీతో గెలవడం పక్కా అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: