జవహర్ రెడ్డి: పచ్చ మీడియా ఎంత మొరిగినా బెదరని సింహం?

Purushottham Vinay
•జవహర్ రెడ్డిపై కడుపు మంటతో రగిలిపోతున్న టీడీపీ, ఎల్లో మీడియా

 

•ఎల్లో మీడియా ఎంత మొరిగినా సింహం లాగా ముందుకు దూసుకుపోతున్న జవహర్ రెడ్డి

 

•ఎల్లో మీడియా ఎంత బురద జల్లినా కడిగిన ముత్యంలా మెరిసిపోతున్న జవహర్ రెడ్డి 


ఏపీ చీఫ్ సెక్రటరీ, డీజీపీ విషయంలో మొదటి నుంచీ టీడీపీకి, ఎల్లో మీడియాకు బాగా కడుపుమంటగానే ఉంది. ఎన్నికల వేళ పదే పదే ఎలక్షన్ కమిషన్ కి అనేక ఫిర్యాదులు చేసి డీజీపీని బదిలీ చేయించారు.ఇక ఇప్పుడు మిగిలింది సీఎస్. ఆయన్ను కూడా బదిలీ చేయించాలని ఎంతగానో తాపత్రయ పడుతున్నారు. ప్రతి రోజూ బురదజల్లే కార్యక్రమం ఈమధ్య ఉధృతం చేశారు. ఇప్పుడు ఏకంగా ఆయనపై బదిలీ వేటు పడుతోందంటూ వార్తల్ని రాస్తూ మొరుగుతున్నారు.ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, వైసీపీకి వంతపాడుతున్నారనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఈ ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ఆయన నిర్ణయాలు తీసుకున్నారని అంటున్నారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. తాజాగా మరోసారి ఈసీకి లేఖ రాశారు తెలుగు దేశం పార్టీ నేతలు.


కౌంటింగ్ స్వేచ్చాయుతంగా, ప్రజాస్వామ్యయుతంగా జరగాలంటే ఈసీని బదిలీ చేయాలని వారు కోరడం జరిగింది. సీఎస్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని తాము ఈసీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు తెలుగుదేశం పార్టీ నేత కనకమేడల రవీంద్రకుమార్. వీరి ఆరోపణల ఆధాంగా సీఎస్ పై బదిలీ వేటు పడుతుందని పచ్చ మీడియా ఊదరగొడుతోంది. ఈమధ్య ఉత్తరాంధ్ర భూముల కుంభకోణం అంటూ మరో వివాదాన్ని తెరపైకి తెచ్చారు తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు. సీఎస్ జవహర్ రెడ్డి కుమారుడు ఈ కుంభకోణంలో కీలక పాత్ర వహించారని వారు అంటున్నారు. ఇక వారి ఆరోపణలకు ఎక్కడలేని ప్రచారం కల్పిస్తోంది ఎల్లో మీడియా.అయితే ఈ వివాదం కూడా ఈసీ దృష్టికి వెళ్లిందని, అందుకే కౌంటింగ్ కి ముందే సీఎస్ పై బదిలీ వేటు పడుతుందని వారు అంటున్నారు. సీఎస్ బదిలీ అయిపోయినట్టేనని తీర్మానిం చేసింది పచ్చ మీడియా.కానీ పచ్చ మీడియా ఎంత మొరిగినా కానీ జవహర్ రెడ్డి ఏమాత్రం బెదరాకుండా సింహం లాగా తన పని తాను చేసుకుంటూ ముందుకి సాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: