ఒకప్పటి అందాల తార సాక్షి.. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి..?
చిరంజీవి నటించిన మాస్టర్ చిత్రంతో తెలుగు తరపు పరిచయమైంది సాక్షి. ఇక అనంతరం నాగార్జున నటించిన సీతారామరాజు మూవీ లో మెరిసింది. అటు అరవింద్ స్వామి నటించిన బోధియాల్ అనే తమిళ్ చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అదేవిధంగా మహేష్ బాబు జోడిగా నటించిన యువరాజు చిత్రంతో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది సాక్షి. అయితే సరిగ్గా మంచి ఫామ్ లో ఉండగా అనూహ్యంగా సాక్షి ఇండస్ట్రీకి దూరమైంది. ఆమె కథానాయకగా నటించిన చివరి సినిమా సింహరాశి. ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ సాక్షికి తెలుగులో మరిన్ని అవకాశాలు రాలేదు.
ఇక తర్వాత 2008లో జగపతిబాబు నటించిన హోమం చిత్రంతో రి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ సాంగ్స్ లో కూడా మెరిసింది. 2010లో శ్రీకాంత్ నటించిన రంగా ది దొంగ చిత్రంలో కనిపించిన సాక్షి అనంతరం మరో సినిమాలోను కనిపించలేదు. ఇక పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది ఈ ముద్దుగుమ్మ. ప్రజెంట్ తన ఫ్యామిలీతో తన లైఫ్ను ఎంజాయ్ చేస్తూ ఉంది. ప్రజెంట్ మీకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈమె ఫోటోలను చూసిన ప్రేక్షకులు.. అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చావుగా. ఇప్పుడు ఇంకా యంగ్గా తయారయ్యావు. మళ్లీ సినిమాల్లోకి వచ్చి అవకాశాలను అందుకో.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.