ఎలక్షన్ ఫీవర్: ఓటర్ల దెబ్బకు రెండు తెలుగు రాష్ట్రాలకు వణుకు..!

Divya
ఈనెల 13వ తేదీన అటు రెండు తెలుగు రాష్ట్రాలలో ఓటింగ్ జరగబోతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఎలక్షన్ ఫీవర్ మాత్రం హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రస్తుతం రాజకీయ పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే.. ఓట్లు వేసేటువంటి ఓటర్లు ఏమో పిల్లి పరిస్థితిలు మారిపోయాయి.. అభ్యర్థుల పరిస్థితి ఎలక లాగా మారిపోయింది.. ఎందుకయ్యా అంటే ప్రస్తుతం వరుస పెట్టి.. ఒకపక్క ప్రచారం గడువు ముగిసిపోతూ ఉండగా.. ప్రచారం తర్వాత 13వ తారీకున ఎన్నికలు జరగబోతున్నాయి.

ఇక్కడ సెలవల పరంగా చూసుకుంటే.. 11వ తారీకు అంటే ఈరోజు సెలవు.. 12వ తారీకు (ఆదివారం) సెలవే.. 13వ తారీకు ఓటింగ్ ఉంటుంది.. కనుక ఆరోజు కూడా హాలిడే.. దీంతో హైదరాబాద్ వంటి ప్రాంతాలలో వెహికల్స్ వేసి ఇక్కడికి తీసుకు వస్తున్నారు చాలామంది నేతలు. దీంతో హైదరాబాద్ ప్రాంతంలో ఉండి ఓటు వినియోగించుకోకుండా ఆంధ్రప్రదేశ్ కు వచ్చి వినియోగించుకుంటున్నారు. అదే సందర్భంలో ఇక్కడున్నటువంటి వాళ్ళు.. ఎక్కడ సరదాగా సెలవులకు పోతారో అన్న భయంతో ఓటర్ల ఇంటి వద్దకు వెళ్లి మరి బతిమలాడుతున్నారు నేతలు..

వీటితో పాటుగా నేతల ప్రాంతాలలో ఉండేటువంటి కొంతమంది కీలకమైన నాయకులతో కూడా మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళకుండా చూసుకోమని సలహాలు ఇస్తున్నారు..ఆ ప్రాంతంలో పరిచయం ఉన్నటువంటి వారితో కూడా ఓటు వేసి వెళ్లండమ్మ అనే చెప్పి పరిస్థితి ఏర్పడుతోంది. కావాలంటే అందుకు తగ్గ ఏర్పాటు కూడా మేమే చేస్తామంటూ పలువురు నేతలు అనేటువంటి పరిస్థితులలో బ్రతిమలాడుతున్నారు.. దీన్నిబట్టి చూస్తే ప్రజలు ఓటు వేయడానికంటే ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి మక్కువ చూపిస్తున్నట్టు కనిపిస్తోంది. మరి ఏ మేరకు ఓటింగ్ శాతం ఎంతవరకు నమోదు అవుతుందో తెలియాలి అంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.. ఈ విషయం పైన కూడా పార్టీ నేతలు , అధినేతలు కూడా చాలా పట్టుదలతో ఈ విషయంలో  ముందుకు వెళుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: