ఏపీ: అంకుల్ పేరు నిలబెడుతున్న కేతిరెడ్డి??

Suma Kallamadi
* కుటుంబ వారసత్వంతో రాజకీయంలోకి అడుగుపెట్టిన నాయకులు
* వీరిలో కేతిరెడ్డి స్పెషల్‌గా నిలుస్తున్నారు
* ఆయన తండ్రి అంకుల్ ఇద్దరు కూడా రాజకీయ నాయకులే
కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో మంచి ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. 2019 నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ధర్మవరం నియోజకవర్గానికి శాసనసభ సభ్యుడిగా (ఎమ్మెల్యే) పనిచేస్తున్నారు. కేతిరెడ్డి ఒక్కరే కాదు ఆయన కుటుంబం కూడా ప్రజల కోసం ఎన్నో విశేష సేవలు అందించారు. ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఆయన మరణించాక కేతిరెడ్డి ఉద్యోగాన్ని మానేసి రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. ఆయన అంకుల్ కేతిరెడ్డి పెద్దా రెడ్డి కూడా ఒక పొలిటీషియన్. వీరిద్దరి వారసత్వాన్ని చాలా చక్కగా ముందుకు తీసుకెళుతున్నారు కేతిరెడ్డి.
కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి, అతని అంకుల్ ఇద్దరూ తమ నియోజకవర్గంలో ప్రజా సేవ, అభివృద్ధికి నిబద్ధతతో ప్రసిద్ది చెందారు. కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి 2009 నుంచి 2014 వరకు తన మునుపటి పదవీకాలాన్ని అనుసరించి 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఆయన మంచితనానికి నిదర్శనమని చెప్పుకోవచ్చు. ప్రారంభంలో భారత జాతీయ కాంగ్రెస్‌లో భాగమైన అతను ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఇది అతని రాజకీయ సమీకరణలో మార్పును ప్రతిబింబిస్తుంది.
ధర్మవరంపై దృష్టి: ఎమ్మెల్యేగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్మవరం అభివృద్ధి, ప్రగతిపై దృష్టి సారిస్తూ పలు స్థానిక సమస్యలు, అవసరాలను తీర్చారు. భారతియార్ వర్సిటీలో చదువుకున్న ఈ నాయకుడు ఎవరైనా పిల్లలు చదువుకోకపోతే చాలా బాధపడి పోతారు తన సొంత డబ్బులను ఇచ్చి మరీ చదువు కంటిన్యూ చేయమని ఎంకరేజ్ చేస్తారు. జగన్ ఇలాంటి గొప్ప వారసుల తర్వాత అంతటి గొప్ప వారసుడిగా కేతిరెడ్డి నిలుస్తున్నారని అనడంలో సందేహం లేదు. ధర్మవరం ప్రజలు కేతిరెడ్డిని ఎమ్మెల్యేగా పొందడం వారి అదృష్టం అని చెప్పడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: