సిట్టింగ్ స్థానంలోనే.. రేవంత్ కు అసలు పరీక్ష?
పార్టీలోని కీలక నేతలందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఒక నియోజకవర్గంలో విజయం మాత్రం రేవంత్ కు మరింత ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. అదే రేవంత్ సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరి. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ గెలవలేదంటే రేవంత్ కు కొంత డ్యామేజ్ గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే 2019 లోక్సభ నియోజకవర్గంలో ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు సీఎంగా ఉండి కూడా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోకపోతే అది రేవంత్ ఇమేజ్ ని డామేజ్ చేయడం ఖాయమని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఇక్కడ బిజెపి నుంచి ఈటెల బిఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి లాంటి బలమైన అభ్యర్థులు పోటీలో నిలిచారు.
ఇక కాంగ్రెస్ నుంచి పట్నం సునీత మహేందర్రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే ఈ లోకసభ నియోజకవర్గంలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలలో కూడా బిఆర్ఎస్ పార్టీనే విజయ డంక మోగించింది. దీంతో ఇక్కడ కాంగ్రెస్కు బలమే లేకుండా పోయింది. ఇంకోవైపు బిజెపి కూడా మల్కాజిగిరిలో కాషాయ జెండా ఎగరేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇక ఈ విషయం తెలిసిన రేవంత్ తన ఇమేజ్ కు డామేజ్ కాకుండా మల్కాజ్గిరిలో విజయం లక్ష్యంగా వ్యూహాలను అమలు చేయడంలో మునిగిపోయారట. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండడం.. ఆ పార్టీకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఏం జరుగుతుంది అన్నది ఓటర్ల డిసైడ్ చేయబోతున్నారు.