బాబోరే గెలుస్తారని జగనోరు ఫిక్స్ అయ్యారా?

Purushottham Vinay
చంద్రబాబు  రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ మోహన్ రెడ్డికి  అర్థమైపోయినట్లుంది. అదెలా అంటే జగన్ చేసే ప్రసంగాలు చూస్తే విషయం ఈజీగా అర్ధం అయిపోతుంది.కాకినాడలో జరిగిన సభలో వచ్చిన జనానికి చంద్రబాబుపై భయం పుట్టించడానికి జగన్ ప్రసంగాలు చేశారు.చంద్రబాబు వస్తే పథకాలు ఆగిపోతాయని.. ఫ్యాన్ కు రెండు ఓట్లేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయని అన్నారు.తెలంగాణ ఎన్నికలకు ముందు కేసీఆర్ కూడా కాంగ్రెస్ గెలవబోతోందని అర్థమైన తర్వాత పూర్తిగా.. ప్రజల్ని భయ పెట్టేందుకే ఎంతగానో ప్రయత్నించడం జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పథకాలు ఆగిపోతాయి.. కరెంట్ ఉండదు.. అంటూ చాలా రకాలుగా జనాలని భయపెట్టారు. అయితే అలా ప్రచారం చేయడమే బాగా ప్లస్ అయింది. ఇంతగా బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తూంటే.. ప్రజలు మాత్రం ఎందుకు ఆ పార్టీకి ఓటేయకూడదని అందరూ అనుకున్నారు. కట్ చేస్తే అలాగే చేశారు. ఇప్పుడు అదే స్ట్రాటజీని జగన్ మోహన్ రెడ్డి కూడా ఫాలో అవుతున్నారు.


టీడీపీ హయాంలో అసలు పెద్దగా ఉనికిలో లేని జన్మభూమి కమిటీల పేరుతో భయపెట్టే ప్రయత్నం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అస్సలు అమలు చేయడని జగన్ చెబుతున్నారు. ఓట్లు కోసం ఎంతో ఆకర్షణీయమైన మేనిఫెస్టోతో వస్తున్నారని కూడా చెబుతున్నారు. కానీ అవన్నీ కూడా అమలు చేయరంటున్నారు. చంద్రబాబు నాయుడును నమ్మితే చంద్రముఖిలా వస్తారని కూడా జగన్ అంటున్నారు. గతంలో ఆయన పశుపతి గురించి ప్రస్తావించడం జరిగింది. చంద్రబాబు నాయుడు తాను పశుపతినేనని.. అంటే శివుడినేనని.. జగన్ పాలనను అంతం చేస్తానని కౌంటర్ ఇవ్వడంతో మరోసారి అలాంటి విమర్శలు జగన్ మోహన్ రెడ్డి చేయలేదు. ఇలా జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం చేస్తూ తాను హామీలు నెరవేరుస్తా అని చెప్పడం … చంద్రబాబు వస్తే.. పథకాలు ఉండవని చెప్పడం తప్ప.. కొత్త విషయం ఏమీ ఆయన ప్రసంగంలో ఉండటం లేదు. మరోసారి గెలిస్తే ఏం చేస్తారో కూడా జగన్ మోహన్ రెడ్డి ఒక్క మాట కూడా చెప్పడం లేదు. మరి చూడాలి ఓట్లు ఎవరికీ రాలతాయి అనేది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: