కుర్ కురే ప్యాకెట్లు పంచిన వ్యక్తిని.. ఇప్పుడెలా ఓటేస్తారు?

praveen
కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న షాక్ లతో అటు బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఎందుకంటే పార్టీ లో ఉన్న కీలక నేతలందరూ కూడా హస్తం గూటికి చేరుకుంటున్నారు. ఈ క్రమం లోనే ఇక రానున్న రోజుల్లో ఎవరు కారు పార్టీని వీడతారు అనే విషయం పై సందిగ్ధత నెలకొంది. అయితే ఎప్పుడు ఎవరు పార్టీలోకి వెళ్లిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అన్న విధంగానే ప్రస్తుత పరిస్థితులు మారి పోయాయ్.

 ఇలాంటి పరిస్థితుల నేపథ్యం లో  మరికొన్ని రోజుల్లో జరగ బోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక మెజారిటీ స్థానాల్లో విజయం సాధించి ప్రస్తుతం కారు పార్టీలో ఉన్న మిగతా నేతలు అందరి లో కూడా ఆత్మ విశ్వాసాన్ని నింపాలని అనుకుంటున్నారు ఆ పార్టీ కీలక నేతలు.  ఈ క్రమం లోనే గెలుపు గుర్రాలను బలి లోకి దింపడమే కాదు ఇక పార్టీ లోని కీలక నేతలందరూ అభ్యర్థులు తరపున ముమ్మర ప్రచారం చేస్తున్నారు. అయితే ఇటీవల జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ లో నిర్వహించిన బూత్ స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ ఇక ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు.

ఈ క్రమంలోనే సికింద్రాబాద్ బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు కేటీఆర్. మత విద్వేషాల  పేరుతో బిజెపి చేసే చిల్లర రాజకీయాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డిని ఓడించడం.. ఒక బిఆర్ఎస్ వల్ల మాత్రమే అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు కిషన్ రెడ్డి. కరోనా టైంలో సికింద్రాబాద్లో కుర్ కురే ప్యాకెట్లు పంచారని అలాంటి నేతకు ఇక ఓట్లు ఎలా వేస్తారు అంటూ ప్రశ్నించారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలవబోయే మొదటి సీటు సికింద్రాబాద్ దే అంటూ స్పష్టం చేశారు కేటీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: