జగన్ పై రాయి దాడి చేసిన నిందితులు అరెస్ట్?

Purushottham Vinay
"మేమంతా సిద్ధం" బస్సు యాత్రకి సంబంధించిన ప్రచారంలో భాగంగా విజయవాడలో ప్రయాణిస్తున్న సమయంలో సీఎం జగన్ మోహన్పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం తెలుస్తోంది.కొన్ని రోజుల నుంచి పలువురు అనుమానితులను విచారించిన పోలీసులు జగన్ మోహన్ రెడ్డిపై సతీష్ అనే వ్యక్తి దాడి చేసినట్లు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం తెలిసింది. ఇదే సమయంలో అతడికి దుర్గారావు అనే వ్యక్తి సహకరించినట్లు కూడా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడిచేసిన కేసులో ప్రధాన నిందితుడు సతీష్ ని అరెస్ట్ చేయడంతొ పాటు, అతడికి సహకరించిన దుర్గారావును అదుపులోకి తీసుకున్నారని సమాచారం తెలుస్తుంది. వెల్లంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేసిన పోలీసులు గత కొన్ని రోజుల నుంచి నిందితులకోసం గాలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో మరికొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ లను సేకరించే పనిలో ఉన్నారని సమాచారం.


ఈ సమయంలో... వీరిద్దరినీ మరి కాసేపట్లోనే కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని సమాచారం తెలుస్తుంది. ఇక ఈ సమయంలో దుర్గారావు అనే వ్యక్తి.. దాడి చేసిన వ్యక్తిని ఇతర ప్రాంతానికి తీసుకుని వెళ్లినట్లు చెబుతున్నారు.అలాగే వీరితో పాటు మరో ఐదుగురి పాత్రపైనా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు.. అందుకు సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారని సమాచారం తెలుస్తుంది. అయితే... ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఒక బైక్ మెకానిక్ నుంచి తెలిసిందని అంటున్నారు. ఈ క్రమంలోనే వడ్డెర కాలనీకి చెందిన సుమారు 25 మంది యువకులను పోలీసులు విచారించారని సమాచారం అందింది. ఈ క్రమంలో... ఈ కేసులో రాజకీయం కోణంపై కూడా పోలీసులు క్షుణ్నంగా విచారిస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. నిందితుల్లో దుర్గారావు అనే వ్యక్తిలో రాజకీయ కోణం కూడా ఉందని సమాచారం. దీంతో... ఈ రాయి దెబ్బ కేసులో ఇంకా ఎలాంటి సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయననేది ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: