ఏపీ : జనసేన పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందించేది ఎప్పుడంటే..?
ఏపీలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు నామినేషన్లు సమర్పించడానికి తుది గడువు ఈ నెల 25. అదే రోజున వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ పులివెందులలో తన నామినేషన్ సమర్పించనున్నారు. ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా అదే రోజు తమ నామినేషన్ వేయనున్నారు. పిఠాపురం నుంచి పోటీలో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఈ నెల 25న తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థులందరికీ మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో బీఫారాలను పవన్ కళ్యాణ్ అందించనున్నారు. పాలకొండ-నిమ్మక జయకృష్ణ, నెల్లిమర్ల- లోకం మాధవి, విశాఖపట్నం సౌత్- వంశీకృష్ణ యాదవ్, అనకాపల్లి- కొణతాల రామకృష్ణ, పెందుర్తి- పంచకర్ల రమేష్ బాబు, యలమంచిలి- సుందరపు విజయ్ కుమార్, కాకినాడ రూరల్- పంతం నానాజీ, రాజానగరం- బత్తుల బలరామకృష్ణ, పి.గన్నవరం- గిడ్డి సత్యనారాయణ, రాజోలు- దేవ వరప్రసాద్, నిడదవోలు- కందుల దుర్గేష్, భీమవరం- పులపర్తి రామాంజనేయులు, తాడేపల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు- పత్సమట్ల ధర్మరాజు, నరసాపురం- బొమ్మిడి నాయకర్, పోలవరం- చిర్రి బాలరాజు, అవనిగడ్డ- మండలి బుద్ధప్రసాద్, తెనాలి- నాదెండ్ల మనోహర్, తిరుపతి- ఆరణి శ్రీనివాసులు, రైల్వే కోడూరు- అరవ శ్రీధర్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్నారు. కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి ఎంపీలుగా పోటీ చేయనున్నారు. వీరంతా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ చేతులు మీదుగా బీఫారాలు తీసుకోనున్నారు.