రాయలసీమ (రాయచోటి): టీడీపీ - వైసీపీ అభ్యర్థుల ప్లస్ మైనస్ లివే..!
అటువంటి శ్రీకాంత్ రెడ్డి పై కూడా అక్కడ కొంతమేర వ్యతిరేకత ఏర్పడుతోంది.. ముఖ్యంగా ఆయన నియోజకవర్గంలో వున్న వాలంటరీలు కమీషన్ తీసుకుంటున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీని కారణంగానే ప్రభుత్వంపై ప్రజలలో కాస్త వ్యతిరేకత ఉన్నట్టుగా కూడా కనిపిస్తోంది.
మరోవైపు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు మడ్డిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. ఈయన ఈసారి గండికోట శ్రీకాంత్ రెడ్డికి ఆపోజిట్ గా టిడిపి పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు. మరి ఈయనకు కలిసొచ్చే అంశాల విషయానికి వస్తే..
గత ఎన్నికలలో ఓడిపోయారనే సింపతి ఈయనకు బాగా కలిసొచ్చే అవకాశం ఉన్నది.
తండ్రి రాజకీయ వారసత్వం కూడా ఈయనకి కాస్త ప్లస్ అయ్యే అవకాశం ఉంది.
ఇక ఈయన మైనస్ పాయింట్ విషయానికి వస్తే... ప్రజలలో ఎక్కువగా గుర్తింపు లేకపోవడం ప్రధానమైనటువంటి అద్దంకిగా కనిపిస్తోంది.
తరచూ పార్టీలు మారుతున్నారనే ప్రచారం కూడా ఎక్కువగా వినిపిస్తోంది.
రాయచోటి నియోజకవర్గం లో ముస్లిం ఓటు శాతం 26 %.. రెడ్డి ఓటర్ల శాతం 19%... ఎస్సీ 13% , బలిజ 10 % ఎస్ టీ 5% ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ అధిక సంఖ్యలో ముస్లింలే ఉన్నారు. అయితే ముస్లింలలో 60 శాతం వైసీపీ పార్టీకే మద్దతు ఇస్తున్నారు. అక్కడ సరైన ప్రాతినిధ్యం తమకు ఇచ్చారని ప్రతిపాదన వినిపిస్తోంది. మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్సీ వంటి కీలక పదవులు కూడా ముస్లింలకే ఇచ్చారట. మిగిలిన 40 శాతం మంది ఓటర్లు టిడిపి పార్టీకి ఉన్నారు. మిగిలిన ఓటర్లలో కులాల వారీగా అటు ఇటుగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఈసారి రాయచోటి నియోజకవర్గంలో అటు శ్రీకాంత్ రెడ్డి ఇటు మడ్డిపల్లి రాంప్రసాద్ రెడ్డి నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు.. మరి ఈసారి ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి. ఒకవేళ శ్రీకాంత్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఐదవ సారి ఆయన విజయం సాధించినట్లు అవుతుంది. మరి ప్రజలు ఎలా నిర్ణయిస్తారో చూడాలి.