ఏపీ పార్లమెంట్ : కడప అడ్డాలో చంద్రబాబు ప్లాన్ కలిసోచ్చేనా.?
కడప జిల్లా అంటే వైఎస్ కుటుంబానికి పెట్టని కోట. జగన్ అక్కడ గత రెండు ఎన్నికల్లో ఏకపక్ష విజయాన్ని సాధిస్తూ వచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో కడప అడ్డాలోనే జగన్ ను దారుణంగా దెబ్బతీయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ షర్మిల తో పాటు వివేక కుమార్తె సునీతతో జగన్ పతనాన్ని కోరుకుంటున్నారు. వివేక హత్య కేసు విషయంలో వైఎస్ సునీత వెనుక చంద్రబాబు ఉన్నారన్నది ఎప్పటినుంచో వినిపిస్తున్న ఆరోపణ. అటు షర్మిల కాంగ్రెస్ లో చేరిక వెనక సైతం ఆయనే ఉన్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే ఆ ఇద్దరూ జగన్ టార్గెట్ చేసుకునే విధానం కూడా ఒకే మాదిరిగా ఉంది. ప్రస్తుతం వారిద్దరూ టీడీపీ పైన ఒక్క మాట కూడా అనట్లేదు. కేవలం వైసీపీ పైన మాత్రమే విరుచుకుపడుతున్నారు.
ప్రస్తుతం కడపలో తెలుగుదేశం పార్టీ సైతం యాక్టివ్ గా ఉంది. కడప లోక్సభ స్థానం నుంచి భూపేష్ రెడ్డి పేరును సైతం చంద్రబాబు ప్రకటించారు. అయితే ఇప్పుడు షర్మిల దూకుడు పెంచి మోతాదుకు మించి విమర్శలు చేస్తుండడంతో అక్కడ ఫైట్ కాంగ్రెస్, వైసీపీ మధ్య అన్న రేంజ్ లో అనిపిస్తుంది.ఆ ఫైట్ లో టీడీపీ పార్టీ తేలిపోతున్నట్లు ఉంది.ఇది ఇలానే కొనసాగితే జగన్ ప్రభుత్వం పై ఉండే వ్యతిరేక ఓటు చీలిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే జగన్ కు భారీ అడ్వాంటేజ్. తెలుగుదేశం పార్టీ మూడో ప్లేస్ కి పడిపోయిన ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే చంద్రబాబు ఆలస్యంగా మేల్కొన్నారు. ప్రధాని మోదీ హెచ్చరికలను పరిగణలోకి తీసుకున్నారు. అందుకే ఇప్పుడు రంగంలోకి దిగారు. వైసీపీని పిల్ల కాంగ్రెస్ గా వ్యాఖ్యనించడం ప్రారంభించారు. కాంగ్రెస్, వైసిపి ఒక్కటేనని ఆ రెండు పార్టీలను ఓడించి కూటమి అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు కోరడం విశేషం.మొత్తానికైతే కడప అడ్డాలో చంద్రబాబు ప్లాన్ తిరిగి టిడిపికి ఇబ్బందుల్లో పెట్టే అవకాశాలు ఉండడంతో చంద్రబాబు జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తుంది.