ఏపీ: జగన్ కి పక్కలో బల్లెంలాగా మారిన సొంత చెల్లెల్లు?
ఈ నేపథ్యంలోనే ఎంతోమంది వైస్సార్సీపీ కార్యకర్తలు నాయకులు అటు టీడీపీలోను, ఇటు కాంగ్రెస్ లోను కలవడం మనం చూస్తూ వున్నాం. కొంతమంది ప్రజలు అయితే 'సొంత చెల్లెళ్లకే న్యాయం చేయలేనివారు సొంత రాష్ట్రానికి ఇంకేం చేస్తాడు?' అని పెదవి విరుస్తున్నారు. నిన్నటి నుంచి కడప జిల్లాలో సునీత, షర్మిలలు రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను తమ ప్రచారంలో ప్రధాన అస్త్రంగా మార్చుకున్నట్టు కొట్టొచ్చినట్టు కనబడుతోంది. వైయస్ వివేకాను హత్య చేసిన వాళ్ళు బయట తిరుగుతున్నారు అంటూ జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలకు వైసీపీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నప్పటికీ అది సరిపోవడం లేదు. నిప్పులేనిదే పొగ రాదుకదా అన్నట్టు జనాలు గుసగుసలాడుకుంటున్నారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఐదేళ్లు దాటుతున్నా తన అన్న అసలు నిందితులను పట్టుకోవడానికి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నట్టు జగన్ ప్రభుత్వాన్ని షర్మిల సునీతలు ప్రశ్నిస్తున్నారు. తమ అన్న అధికారంలో ఉన్నప్పటికీ న్యాయం చేయలేకపోతున్నారని, నిందితుల పక్షాన నిలబడి తమకు అన్యాయం చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. దాంతో ఈ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని వారు ప్రజలను అడుగుతున్నారు. కడప ఎంపీగా మరోసారి పోటీ చేయబోతున్న అవినాష్ రెడ్డిని ఓడించి వివేకానంద రెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చాలంటూ వారు ప్రజలను అభ్యర్థిస్తున్నారు.