గుంటూరు : బాలయ్య బాబు స్నేహితుడికి 'జగన్' అవకాశం ఇస్తాడా..?
గుంటూరు లో సామాజిక సమీకరణాల్లో భాగంగా ఎంపీ స్థానం కాపు వర్గానికి ఇవ్వాలని జగన్ రోశయ్యను కేటాయించారు.అయితే రోశయ్య పోటీకి సుముఖంగా లేకపోవడం తో అదే వర్గానికి చెందిన మరోక నేతను వెతికే పనిలో పార్టీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తుంది.దాంతో సినీ హీరో నందమూరి బాలకృష్ణ సన్నిహితుడు ఐనా కదిరి బాబురావును బరిలోకి దింపుతారని వైసీపీలో చర్చ జరుగుతుంది.ఆయన 2020లో వైసీపీలో చేరారు.ప్రస్తుత ఎన్నికల్లో ఆయనకు సీటు దక్కలేదు కనుక గుంటూరు నుంచి బాబురావును బరిలోకి దింపే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్లు సమాచారం.కాకపోతే ఆయన నాన్ లోకల్ కావడంతో అవకాశం ఇస్తారా లేదా అనేది అనుమానంగా ఉంది.అదే టైం లో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేరు కూడా తెర మీదకు వచ్చింది. ఏ విషయం అనేది ఉగాది తర్వాత సీఎం జగన్ గుంటూరు ఎంపీ అభ్యర్థి విషయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ పెద్దలు చెప్తున్నారు.