ఏపీ: ఎన్నికలవేళ పెన్షన్ రాజకీయం... దెబ్బకి 33 మంది వృద్ధులు బలి?
ఇక పెన్షన్ ఇస్తున్న రోజు సచివాలయాల వద్దకు అనేక మంది పరుగులు తీసిన ఘటనలు మీరు చూసే వుంటారు. ఈ నేపథ్యంలోనే పలు చోట్ల 33 మంది వృద్ధులు చనిపోయారని వినికిడి. అయితే ఇక్కడ ఆ చనిపోయిన మనుషులు మాత్రం ఎవరన్న విషయం ఆ దేవుడికి తప్ప ఇంకొకరికి తెలియదు. ఏదిఏమైనా నేడు ఆంధ్ర రాజకీయం శవాల ఊరేగింపులు నడుమ జరుగుతోంది అనడంలో సందేహమే లేదు. ఇది నేతలు సిగ్గు పడాల్సిన విషయం అంటూ కొంతమంది విమర్శకులు భావిస్తున్నారు. ఖజానాలో ఉన్న డబ్బులన్నీ కాంట్రాక్టర్లకు వదిలేసి, ముసలివాళ్ళ పెన్షన్లకు మాత్రం, అప్పుల మీద ఆధారపడింది ఈ వైసీపీ ప్రభుతం అని బాబు, కొడుకులు ఊరేగుతూ మాట్లాడుతుంటే, సొంత మామనే లేపేసిన బాబుకి ఈ అవ్వాతాతలు ఒక లెక్కా అని జగన్ బస్సు యాత్రలో మైకులు పగిలిపోయేలా మాట్లాడుతున్నాడు.
ఏది ఏమైనా గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నది రాక్షస రాజకీయం అని రాజకీయ ఉద్దండులు మాట్లాడుకుంటున్నారు. వృద్ధుల ప్రాణాలు పోకున్నా వారు చనిపోవాలని నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. వృద్ధుల శవాల కోసం కాచుకు కూర్చున్న వైసీపీ నేతలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాజకీయం చేస్తే బావుంటుంది, లేదంటే రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని అంటున్నారు. అదేవిధంగా సగటు వృద్ధుడు అయిన బాబు ఈ వృద్ధాప్య రాజకీయం మానుకుంటే ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు.