నాకు ఓటు వెయ్యకపోతే.. మీ సంగతేంటో చూస్తా.. ఎంపీ అభ్యర్థి మాస్ వార్నింగ్?

praveen
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా పార్లమెంట్ ఎన్నికల హడావిడి నెలకొంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా కేంద్రంలో అధికారాన్ని దక్కించుకునేందుకు రెండు కూటములు కూడా తెగ పోటీ పడుతున్నాయి. అయితే ఇప్పటికే వరుసగా రెండుసార్లు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమి ఇక మూడోసారి కూడా హ్యాట్రీ కొట్టాలని భావిస్తుంది. అయితే ఇక ఇతర పార్టీలను చేర్చుకుంటూ బలమైన కూటమిగా అవతరిస్తున్న india కూటమి సైతం ఇక ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటాము అనే ఆశాభావంతో ఉంది.

 అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలలో కూడా ప్రస్తుతం హడావిడి నెలకొంది. ఇక ఓటరు మహాశయులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఆయా పార్టీల నుంచి బరిలోకి దిగుతున్న ఎంపీ అభ్యర్థులు అందరూ కూడా తెగ హామీలు కురిపిస్తున్నారు. ఇక ఎప్పుడు ప్రజల్లో తిరుగుతూ ప్రచారంలో మునిగి తేలుతూ ఉన్నారు. అయితే ఇలా ప్రచారం చేస్తున్నవారు ఎవరైనా ఓటర్లను ఆకట్టుకునేందుకు బ్రతిమలాడడం లేదంటే హామీలు ఇవ్వడం చేస్తుంటారు. ఇంకొంతమంది రహస్యంగా డబ్బులు పంచడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు.

 కానీ ఇక్కడ ఒక ఎంపీ అభ్యర్థి మాత్రం ఓటర్లకు డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. నాకు ఓటు వేయండి లేదంటే మీ సంగతేంటో చూస్తాను అంటూ ఇక సభలోనే డైరెక్టర్ వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారిపోయింది. యూపీలోని ఒక ఎంపీ అభ్యర్థి ఇలా ఓటర్లకు వార్నింగ్ ఇచ్చారు. బదాయ నియోజకవర్గం నుంచి సమాజ్వాది పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శివపాల్ యాదవ్ ఒక సభలో పాల్గొన్నారు. మాకు ప్రతి ఒక్కరి ఓటు కావాలి.. మీరు ఓటు వేస్తే సరి.. లేకపోతే ఆ లెక్క తర్వాత చూసుకుంటా అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చాడు శివపాల్ యాదవ్. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో పై స్పందించిన శివ పాల్ తన పాత వీడియోని కొంతమంది కావాలనే ఎడిట్ చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అంటూ వివరణ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: