ఏపీ: ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ ఓటమికి స్టార్ క్యాంపెయినర్లు వారేనా...?
అలాంటి పరిస్థితుల్లో వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. సొంత జిల్లా కావడంతో అక్కడి యాసలో బాధితులకు హామీలు ఇచ్చారు. తాను ఉన్నానని, తాను చూసుకుంటానని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. కట్ చేస్తే విషాదం జరిగి రెండేళ్లు దాటింది. వరద బాధితులు తమకు సాయం అందక ఇబ్బందులు పడుతున్నారు. సొంత జిల్లాకే చెందిన సీఎం ఇచ్చిన హామీలు గంగలో కలిసిపోయాయి. తమను పరామర్శించిన సమయంలో ప్రజలు నిలదీయడంతో వారికి ఇళ్లు కట్టించి ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. దీంతో కాంట్రాక్టర్ కేవలం పునాదుల వరకు ఇళ్లు నిర్మించి గాలికి వదిలేశారు. దీంతో దిక్కు తోచని పరిస్థితుల్లో వరద బాధితులు ప్రస్తుతం కాలం వెళ్లదీస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఇచ్చిన టార్పాలిన్లతో గుడారాలు వేసుకుని జీవిస్తున్నారు. తమకు ప్రభుత్వం కొండంత సాయంగా నిలబడుతుందనుకుంటే తమను పట్టించుకోకుండా వదిలేసిందనే ఆవేదనతో ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల వాతావరణం ఏపీలో నడుస్తోంది. అందరికీ తాము సాయం చేశామని, పార్టీలు పట్టించుకోకుండా సంక్షేమ ఫలాలు అందించామని ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ ఊదరగొడుతున్నారు. అయితే సొంత జిల్లాలోని వరద బాధితుల సంగతేంటని ప్రతిపక్షాలు ఆయనను ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికీ వారి వైపు చూడలేదని విమర్శలు చేస్తున్నాయి. సొంత జిల్లాలోనే ఇలాంటి దుస్థితి ఉందని తూర్పారపడుతున్నాయి. కనీసం తమకు ఇళ్లు కట్టించకపోవడంతో దీనావస్థలో ఉన్న అన్నమయ్య డ్యామ్ వరద బాధితులు వైసీపీకి గట్టి దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే సొంత జిల్లాలో వైసీపీకి పరాభవం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.