సోషల్‌ మీడియా: చట్టాన్ని అడ్డుపెట్టుకుని రెచ్చిపోతున్న కాలనాగులు?

Chakravarthi Kalyan
ఏపీ హైకోర్టు ఓ కీలక తీర్పు వెల్లడించింది. 41ఏ నోటీసుపై కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణ నిమిత్తం తమ ముందు హాజరు కావాలని సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నిందితులకు పోలీసులు నోటీసులు జారీ చేశాక ముందస్తు బెయిల్ పిటిషన్ కు విచారణర్హత ఉండదని చెప్పడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. 41 ఏ నోటీసు ఇచ్చినా.. అరెస్టు ఆందోళన ఉంటుందని.. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లను విచారించకుండా న్యాయస్థానాలు తోసిపుచ్చడానికి వీల్లేదని కర్ణాటక హైకోర్టు రామప్ప కేసులో తీర్పును గుర్తు చేసింది.

ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. మల్లిఖార్జున రావు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. కొంతమంది నకిలీ ఫేస్ బుక్ ఐడీ సృష్టించి షర్మిళ, సునీతలను అపకీర్తి పాలు చేయడంతో పాటు దూషిస్తూ పోస్టులు పెట్టారని రవీంద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న విశాఖ పట్నానికి  చెందిన పినపల ఉదయ్ భూషన్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీపీ వాదనలు వినిపిస్తూ విచారణ నిమిత్తం హాజరుకావాలని పిటిషనర్ కు 41ఏ కింద నోటీసు ఇచ్చామన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరం లేదన్నారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్ చంద్ర వాదనలు వినిపిస్తూ విశాఖ పట్నంలో ఉన్న పిటిషనర్ కు పోలీసులు 41ఏ నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. అయినా కానీ వేధించాలన్న ఉద్దేశంతో పులివెందుల ఠాణాకు తీసుకెళ్లి అక్కడ నిర్భందించారన్నారు. ఫిర్యాదు దారుడు వి. రవీంద్రారెడ్డి పిటిషనర్ ను హతమారుస్తామని ఠాణాలో బెదిరించారన్నారు. ఈ నేపథ్యంలో పిటిషనర్ పులివెందుల ఠాణాకెళ్లి దర్యాప్తు ముందు హాజరు కాలేదన్నారు.

అయితే 41 ఏ కింద నోటీసు ఇచ్చినా అరెస్టు గురించి ఆందోళన ఉందన్నారు. కర్ణాటక హైకోర్టు తీర్పును న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పిటిషనర్ కు ప్రభుత్వం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అంటే నీచంగా పోస్టులు పెట్టి మహిళల వ్యక్తిత్వాన్ని కించ పరిచిన వారికి కూడా రక్షణ ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: