ఈజీగా గెలిచే మూడు సీట్లు జగన్ చేతిలో పెట్టేసిన చంద్రబాబు..?
2014లో జనసేన సపోర్ట్ చేయడంతో ఈ మూడు సీట్లలో టీడీపీ ఈజీగా విన్ అయ్యింది. అయితే ఈ సారి చేసిన పొరపాటు తో పాటు పొత్తులో ఈ సీట్లు జనసేన, బీజేపీకి ఇవ్వడంతో మూడు సీట్లలో పార్టీ ఘోరంగా ఓడిపోనుందని అంటున్నారు. ఎచ్చెర్ల సీటును కళా వెంకట్రావు తో పాటు కలిశెట్టి అప్పలనాయుడు ఆశించారు. అయితే ఈ సీటును నాన్ లోకల్ కు అది కూడా బీజేపీకి ఇచ్చారు.
పైగా తూర్పు కాపులు ఎక్కువుగా ఉన్న సీటును కమ్మ నేతకు ఇవ్వడం కూడా పార్టీకి పెద్ద దెబ్బ పడిపోనుంది. ఈ సీటు బీజేపీకి ఇవ్వడం.. పైగా క్యాస్ట్ ఈక్వేషన్ రెండు మైనస్ అయ్యి పార్టీ దెబ్బతిననుంది. ఇక నెల్లిమర్ల సీటును టీడీపీలో కర్రోతు బంగార్రాజుకు ఇస్తే టీడీపీ ఈజీగా విన్ అయ్యేది. ఈ సీటును జనసేన నుంచి లోకం మాధవికి ఇచ్చారు. ఇది కూడా రాంగ్ స్టెప్పే.
ఇక అనపర్తి సీటును టీడీపీ తీసుకుని నల్లమిల్లి రామకృష్ణా రెడ్డికి ఇస్తే ఈజీగా గెలిచేది. కానీ ఈ సీటును బీజేపీకి ఇవ్వడంతో పాటు అసలు ఊరూ పేరు లేని వ్యక్తికి.. అందులోనూ ఇక్కడ రెడ్డి వర్గం ఆ తర్వాత కాపు వర్గం బలంగా ఉంటే క్షత్రియ వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వడంతో అనపర్తి సీటును కూడా చేజేతులా కోల్పోతున్నట్టు అవుతోంది. ఏదేమైనా బాబు పొత్తులో భాగంగా వేసిన తప్పులు పార్టీని నిలువునా ముంచేసేలా ఉంది.