అనపర్తిలో టీడీపీ శ్రేణుల ఆగ్రహం.. పట్టించుకోని బాబు..?
చంద్రబాబు నల్లమిల్లికి ఫోన్ చేసి శాంతింపజేసే ప్రయత్నం చేశారు. రామకృష్ణారెడ్డి తన అభిప్రాయాన్ని సూటిగా వెల్లడించారు. నియోజకవర్గ పరిస్థితిని, కార్యకర్తల బాధలను వివరించారు. అక్రమ కేసులు పెట్టి పార్టీ కోసం ప్రాణాలర్పించి పనిచేశానన్నారు. గతంలో వైఎస్ఆర్ ఫోన్ చేసినా పార్టీని వీడలేదన్నారు. కుటుంబంతో సహా ప్రజల ముందుకు వెళ్లి తనకు, తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించి ఆదుకోవాలని రామకష్ణా రెడ్డి అన్నారు.
ఐదేళ్లలో తనపై వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా తనపై 39 కేసులు, ఉద్యమకారులపై సుమారు 200 కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదని గుర్తు చేశారు. తనకు టికెట్ రాకుండా ప్రస్తుత అనపర్తి ఎంఎల్ఎ డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి బావమరుదులు పనిచేశారన్నారు. టిడిపిలో తన కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. టీడీపీ కోసం అహర్నిశలు కష్టపడ్డానని, తనకు టికెట్ ఇవ్వలేదన్నారు. ఈ ఘటనపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించకపోవడంపై నల్లమల్ల కుటుంబం వాపోయింది.