పిఠాపురంలోకి ఎంట్రీ ఇస్తున్న ముద్రగడ.. మరి జనసేన..!!
కిర్లంపూడిలో తన నివాసంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు..ఎన్నికల ప్రచార శైలి ఏ విధంగా ఉండాలి సభలు సమావేశాలను కూడా ఎలా నిర్వహిస్తుండాలి వాటిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని ప్రజలకు ఇలాంటి విషయాలు చేరవేయాలనేవి మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను ఎదుర్కోవాలంటే కలిసి పని చేయాలంటూ కూడా సూచనలు ఇచ్చారట. 2009లో తాను పిఠాపురం నుంచి పోటీ చేసినప్పుడు ఇప్పటికి రాజకీయాలు చాలా మారిపోయాయని.. పిఠాపురం సెగ్మెంట్ బాధ్యతలు తనకి కూడా అప్పగించారంటూ వెల్లడించారు ముద్రగడ పద్మనాభం. అలా కిర్లంపూడి లో ఉన్న ముద్రగడ పద్మనాభం పిఠాపురం వైసిపి నాయకులు కలవడం జరిగిందట.
ఈ సందర్భంగా వైయస్సార్ పార్టీలోని కొంతమంది పెద్దలు వైయస్ జగన్ ను మరొకసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని తపన ప్రతి ఒక్కరిలోనే ఉందని అందుకే చాలా కష్టపడి పని చేస్తున్నామని అందరికీ కూడా పిలుపునిస్తున్నామని తెలిపారు.. ఎన్నికలు మీ ఎన్నికలు అనుకొని కలిసిగా పనిచేస్తామంటూ కూడా తెలిపారుట.. వైసిపి పార్టీ గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను మీ పని మీరు చేయండి అంటూ ముద్రగడ పద్మనాభం వెల్లడించారు. అయితే వంగ గీత ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్న అధికారులు పర్మిషన్ లేకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు అంటూ అడ్డుకున్నారట. దీంతో ఆమె అక్కడి నుంచి వెను తిరిగి వెళ్ళిపోయింది..