పొత్తుల అంశంపై క్లారిటీ ఏంటంటే?

Purushottham Vinay
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంతో ఆసక్తిగా మారాయి. ప్రధాన పార్టీలు గెలుపు వ్యూహాలపై కసరత్తులు స్టార్ట్ చేశాయి. అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో పొత్తు రాజకీయాలపై సస్పెన్స్ కొనసాగుతోంది.ఇప్పటికే.. టీడీపీ ఇంకా జనసేన పొత్తుపై ఓ క్లారిటీ ఉన్నా.. వారితో బీజేపీ కలుస్తుందా లేదా అనే దానిపై క్లారిటీ అనేది రావడం లేదు. కొద్దిరోజుల కిందట చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు.తర్వాత పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కూడా హస్తినకు వెళ్తారని ప్రచారం జరుగుతుంది. ఈక్రమంలో భీమవరంలో పర్యటించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కార్యకర్తల సమావేశంలో.. పొత్తుల అంశంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. టీడీపీ, బీజేపీతో కలిసి వస్తున్నామని పవన్ చెప్పారు.ఇందు కోసం తానెంత కష్టపడ్డానని తెలిపారు.టీడీపీ-జనసేనతో కలిసి వచ్చేలా బీజేపీని పొత్తుల కోసం ఒప్పించేందుకు తానెంతో నలిగిపోయానని చెప్పారు పవన్ కళ్యాణ్. అలాగే మరోవైపు.. పొత్తులపై పవన్‌ కల్యాణ్‌ చేసిన కామెంట్స్ కు భిన్నంగా.. ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


తెలుగుదేశం పార్టీకి ఎన్డీయేలో చేరాలని ఆహ్వానం అందిందన్నారు. ఈ అంశంపై మాట్లాడేందుకే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారని చెప్పారు. ఇక ఇప్పటికే జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. మొన్న అమిత్‌షాతో బాబు భేటీ తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏలో చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఎన్డీఏలో రెండు సార్లు చంద్రబాబు నాయుడు చేరారు.వాజ్‌పేయి గవర్నమెంట్ సమయంలో అంటే 2004 దాకా ఎన్డీఏలో ఉన్న చంద్రబాబు నాయుడు తర్వాత బయటకు వచ్చారు. తర్వాత 2014ఎన్నికలకు ముందు ఏన్డీఏతో జతకట్టి.. 2017 దాకా కూటమిలో ఉన్నారు. ఇక ఏన్డీఏలో భాగంగా టీడీపీ ఎంపీలు కూడా కేంద్ర మంత్రి పదవులు పొందారు. ప్రత్యేక హోదా విషయంలో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావడంతో కేంద్రమంత్రి పదవులకు పార్టీ నేతలు రాజీనామా చేసి బీజేపీపైనే ఫైట్ చేయడం జరిగింది.మరోసారి టీడీపీ గనుక ఎన్డీఏలో చేరితే ఇది మూడోసారి అవ్వనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: