ప్రపంచ దేశాలకు తెలియకుండా.. పుతిన్ తో మోడీ సీక్రెట్ డీల్?

praveen
కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ప్రపంచ దేశాలతో ఉన్న సంబంధాలను ఎంతలా మెరుగుపరుచుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరీ ముఖ్యంగా  అగ్రదేశాలతో దౌత్య సంబంధాలను బలంగా మార్చుకుంది మోడీ సర్కార్. అయితే ఏ దేశంతో శత్రుత్వం పెట్టుకోకుండా అలిన విదేశాంగ విధానాన్ని ఎంతో పక్కాగా  అమలు చేస్తుంది అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ప్రపంచ దేశాలు అన్నీ కూడా రష్యా, అమెరికా అంటూ రెండు గ్రూపులుగా విడిపోయాయి అన్న విషయం తెలిసిందే.

 ఇలాంటి సమయంలో అటు భారత్ మాత్రం ఒక వైపు అమెరికాతో మరోవైపు రష్యా తో కూడా సత్సంబంధాలను కొనసాగిస్తూ వస్తోంది . ఇలాంటి దౌత్య సంబంధాలతోనే అటు భారత ఆయుద సంపదను కూడా పెంచుకుంటూ వస్తుంది కేంద్రం. అయితే ప్రస్తుతం భారత విదేశాంగ మంత్రిగా కొనసాగుతున్న జైశంకర్ ఈ వ్యవహారాలన్నింటినీ కూడా ఎంతో సమర్థవంతంగా నడిపిస్తున్నారు. మరోవైపు అజిత్ దోవల్ ఇక రక్షణ దళాన్ని మరింత పటిష్టవంతం చేస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇటీవల మోదీ ఏకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఒక రహస్యమైన డీల్ నడిపించాడు అంటూ ఒక వార్త అంతర్జాతీయ సమాజంలో హాట్ టాపిక్ గా మారింది.

 మొన్నటి వరకు భారత వాణిజ్య నౌకలపై  హౌతీ తీవ్రవాదులు ఎంతలా రెచ్చిపోయి దాడులు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  కానీ ఇప్పుడు అలాంటి దాడులు జరగడం లేదు   అయితే దీని వెనక ఒక రహస్య ఒప్పందం ఉంది అన్నది తెలుస్తుంది. ఇటీవల జై శంకర్ అటు రష్యా తో పాటు ఇరాన్లో పర్యటించారు  అయితే ఇరాన్ ఏకంగా హౌతి, హమాస్ లాంటి ఎన్నో తీవ్రవాద సంస్థలను నడిపిస్తుంది. అదే సమయంలో రష్యా కను సన్నల్లోనే హౌతి లాంటి తీవ్రవాద సంస్థలు పనిచేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోని ఈ రెండు దేశాల్లో పర్యటించిన జైశంకర్ ఏకంగా భారత వాణిజ్య నౌకలపై దాడులను ఆపేలా రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు అని అంతర్జాతీయ మీడియా సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: