Ap: తెలుగుదేశం పార్టీలో లోకేష్ ని పక్కన పెట్టినట్టేనా..?

Divya
ఏపీ పాలిటెక్లో చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఎమ్మెల్యేగా గెలవలేకపోయినా ఎమ్మెల్సీ ని చేసి మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఏం చేసినా తన కుమారుడు నారా లోకేష్ ని పొలిటికల్ పరంగా పైకి లేపి సీఎం పదవిలో చూడాలని చాలా కలలుకంటున్నారు. అందుకు తగ్గట్టుగానే అటు బాలకృష్ణ కుటుంబంతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు కొంతమంది ప్రాకులాట పడుతున్నారు. దీంతో చంద్రబాబు నాయుడు కూడా ఎంతటికైనా తెగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని కూడా కొనసాగిస్తూ ఉన్నారు.


2019 ఎన్నికలలో నారా లోకేష్ పోటీ చేయక ఓడిపోయారు. వాస్తవానికి ఓడిపోకూడదు కానీ.. తనకంటూ ఒక ఏ బ్రాండ్ ని సృష్టించుకోలేకపోయినా లోకేష్ ఓటమిపాలయ్యారు. ఇదంతా పక్కన పెడితే రాజకీయంగా నారా లోకేష్ మాట్లాడే ప్రతి మాట కూడా టిడిపి పార్టీని చాలా దెబ్బతినేలా కనిపిస్తోంది.ఆర్థికంగా కూడా అదే పరిస్థితి ఏర్పడడంతో వచ్చే ఎన్నికలలో జనసేనతో పొత్తు పెట్టుకుని మరి పొలిటికల్ పరంగా అడుగులు వేస్తున్నారు చంద్రబాబు. అయితే పొత్తు విషయంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక గందరగోళం కనిపిస్తూ ఉంటుంది.


అందుకు కారణం లోకేష్ టీమ్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ప్రతిసారి జనసేన నుంచి ఒకటే కంప్లైంట్ వస్తోందట. మీ కుమారుడు బృందాన్ని కాస్త అదుపులో పెట్టుకోండి అంటూ డైరెక్ట్ గానే జనసేన అభ్యర్థులు సైతం తెలియజేస్తున్నారు. లోకేష్ వల్లే టిడిపి నాశనం అవుతుందని ఆయన చేస్తున్న కొన్ని పనుల వల్లే ఇలా ఇబ్బంది పడుతోందని చంద్రబాబు తెలిసి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు.. ఇలాంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు బాగా వినిపిస్తోందని వార్తలు విన్న చంద్రబాబు నాయుడు.. దీంతో ఎన్టీఆర్ కోణంలో ఆలోచించి టిడిపి దరిదాపుల్లోకి కూడా ఎన్టీఆర్ ని రాకుండా చేయాలని నారా లోకేష్ ని జాకీలు పెట్టి మరి పైకి లేపుతున్న లేవలేకపోతున్నారు.దీంతో లోకేష్ ని టిడిపి శ్రేణులు పెద్దగా పట్టించుకోవట్లేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: