లోకేశ్‌ ఎక్కడ.. అరెస్టు భయంతోనే మిస్సింగ్‌?

Chakravarthi Kalyan
రాష్ట్రంలో ప్రస్తుతం యువ టీడీపీ నేత నారా లోకేశ్ లేరని ఎక్కడికో వెళ్లిపోయారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.. అయితే ఆయన ఎక్కడికి వెళ్లలేదని ఢిల్లీలో ఉన్నారని పలువురు పార్టీల నేతల్ని కలిసి మద్దతు కోరుతున్నారని చెబుతున్నారు. ఎన్టీఆర్ దేవుడు అని చెప్పే ఎకో సిస్టమ్ అని చెప్పేది టీడీపీ వారే.. ఎన్టీఆర్ దుర్మార్గుడు అన్నది కూడా టీడీపీ అనుకూల మీడియా నాయకులే.. ఎవరన్న కాదని విమర్శిస్తే  వారిపై విరుచుకుపడి వార్తలు రాస్తారు. నారా లోకేశ్ క్యాంపులో వివిధ నేతలు కలుస్తున్నారు. ఆయన పలు పార్టీల నేతలను కలిసి చంద్రబాబు అరెస్టు అక్రమంగా జరిగిందని కావాలనే కుట్ర పన్ని అక్రమంగా కేసులు బనాయించారని వివిధ నేతల మద్దతు కడుగుతున్నారు.

అయితే నారా లోకేశ్, భువనేశ్వరి, బ్రాహ్మణి, తదితర టీడీపీ నేతలు ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే వివిధ టీడీపీ నేతలు ఉన్నా కూడా. అక్కడ బుచ్చయ్య చౌదరి, ఇతర సీనియర్ టీడీపీ నాయకులు ఉన్నా కూడా కేవలం లోకేశ్ క్యాంపు అని పేరును క్రియేట్ చేసి ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ఇలా ప్రతి చోట ఎల్లో మీడియా అనుకున్నది ప్రజల మెదళ్లలోకి ఎక్కించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది.

చంద్రబాబు అరెస్టు తర్వాత అనేక విషయాలపై జాతీయ మీడియాలో కూడా లోకేశ్ కుండ బద్ధలు కొట్టేలా మాట్లాడారని దీంతో నిజానిజలు తెలిసాయని చెబుతుంటారు. ఇలా ప్రతి విషయంలో ఆయన్ని ఆకాశానికి ఎత్తే పనిని చేస్తుంటారు. అసలు విషయాలు సమాజానికి తెలియజేయకుండా అక్కడికి వెళ్లిన ఉద్దేశాన్ని బయట పెట్టకుండా వివిధ రకాలుగా ప్రచారం చేస్తుంటారు.

అయితే చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్నా కూడా ఇక్కడే అమరావతి లో ఉండి మాట్లాడినట్లు ఇక్కడి డేట్ లైన్లు పెట్టి వార్తలు రాస్తుంటారు. ప్రజలను తప్పు దోవ పట్టిస్తారు. అదే జగన్ హైదరాబాద్ లో ఉంటున్నారని ప్రచారం చేసిన ఎల్లో మీడియా చంద్రబాబు విషయంలో మాత్రం నిజాలను దాస్తూ ప్రచారం చేస్తుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: