బాలికకి మద్యం తాగించి గ్యాంగ్ రేప్ కి పాల్పడిన నీచులు?

Purushottham Vinay
దేశంలో బాలికలపై లైంగిక దాడులను అరికట్టడానికి ప్రభుత్వం పోక్సో చట్టంని తీసుకొచ్చినా కూడా రోజుకో చోట వారిపై చాలా అఘాయిత్యాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కామంధులు వారి పశువాంఛను తీర్చుకోవడానికి చిన్నపిల్లలను ఇంకా అమాయకపు బాలికలను చాలా దారుణంగా వాడుకుంటున్నారు.తాజాగా హైదరాబాద్లోని పాతబస్తీ ఏరియాలో కొంతమంది యువకులు బాలికకు మద్యం తాగించి మరి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడటం జరిగింది.ఇక తెలంగాణలోని ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ దారుణమైన ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు, పోలీసులు ఇంకా అలాగే కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ బాలిక ఈనెల 4వ తేదీన మందులు కోనేందుకు తనకు తెలిసిన హోల్‌సేల్‌ ఔషధాలు విక్రయించే దుకాణం వద్దకు ఆమె వెళ్లింది. అక్కడే ఉన్న ముగ్గురు యువకులు తక్కువ ధరకు మందులు ఇప్పిస్తామని చెప్పి ఆమెని నమ్మించి.. ఆ బాలికను కందికల్లోని బోయిగూడలో ఓ ఇంటికి తీసుకువెళ్లారు.ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఆ బాలికతో వారు బలవంతంగా హుక్కా తాగించారు. ఆ తర్వాత కాసేపటికి కూల్ డ్రింక్ లో మద్యం కలిపి బాలిక చేత తాగించారు. ఆ తరువాత ఆమెతో వారు అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె కేకలు వేసింది.


ఇక ఆ నిందితులు బాధితురాలి అరుపులు బయటకు వినపడకుండా మ్యూజిక్‌ సిస్టంలో సౌండ్‌ పెంచారు. దీంతో ఆ బాలిక తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. బాలికపై దాడికి కూడా ఆ నీచులు పాల్పడ్డారు. కొద్దిసేపటి తర్వాత ఆ బాలిక మత్తులోకి జారుకోగానే ఆమెపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడటం జరిగింది.ఇక ఆ బాధితురాలికు మెలుకువ రాగానే వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకొని ఏడ్చుకుంటూ జరిగిన విషయం గురించి ఆమె తల్లికి చెప్పింది. దీంతో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించగా వారు ఆ నిందితులు పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక ఇచ్చిన వివరాలతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆ నిందితుల కోసం గాలించారు. చివరకు ఏపీలోని గుంటూరు జిల్లాలో వారు ఉన్నట్లు తెలుసుకొని వెంటనే అక్కడికి వెళ్ళి పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనలో ముగ్గురు యువకులు ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడగా.. మరో ఇద్దరు ఆ నిందితులకి సహకరించినట్లు పోలీసులు  గుర్తించారు. ఇక ఆ నిందితులు ఐదుగురిని కూడా రిమాండ్కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: