ఏపీలో మరో జిల్లా ఏర్పాటుకు రంగం సిద్ధం ?

VAMSI
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ఇంకా ఆంధ్ర ప్రదేశ్  ప్రత్యేక రాష్ట్రాలు గా సపరేట్ అయ్యాక ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తంగా 13 జిల్లాలు ఉండగా...ఇపుడు కొత్తగా మరో 13 జిల్లాలు ఏర్పాటు జరగడం తో ఇప్పుడు మొత్తంగా  ఏపి లో మొత్తం 26 జిల్లాలు ఉన్నాయి.ఈ నెల అనగా ఏప్రిల్ 4 న కొత్తగా 13 జిల్లాలను సీఎం జగన్ ప్రారంభించడం జరిగింది. పాలన కూడా ప్రారంభం అయ్యింది. ఇక ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లో నూతన ప్రభుత్వ కార్యాలయాలు, అలాగే ల్యాండ్ మార్కెటింగ్ వాల్యూ వంటి పనుల హడావిడి జరుగుతుండగా....మరో వైపు ప్రజల నుండి ప్రభుత్వానికి డిమాండ్ లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే కొత్తగా 13 జిల్లాలను అమలులోకి తీసుకు వస్తె కొన్ని ప్రాంతాల ప్రజలు మాత్రం తమకు ప్రత్యేక జిల్లా కావాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

అయితే తాజాగా ఈ అంశం పై  మంత్రి పేర్ని నాని స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారు అంటే... ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటయ్యే అవకాశముందని చెప్పడం విశేషంగా మారింది. అంతేకాదు... గిరిజన ప్రాంతాలతోనే ఈ నూతన జిల్లా ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని సమాచారం అని ఆయన అన్నారు. ఇక ఈ విషయం ఇప్పటికే జగన్ దృష్టికి తీసుకెళ్లడం, ప్రణాళిక చెయ్యడం జరిగిందని...అలాగే దాదాపుగా  27వ జిల్లా ఏర్పాటుకు రంగం సిద్దం అయ్యిందని అంటున్నారు.

అయితే కొత్తగా రాబోతున్న జిల్లా ఎక్కడ అన్న క్రమంలో రంపచోడవరంను కొత్త జిల్లాగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు వివరాలపై నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడే రంపచోడవరంను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని వారి ఆకాంక్షను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్లు చాలానే వినిపించాయి. అయితే అప్పుడు కొన్ని కారణాల వలన అది జరగలేదు. కానీ ఇప్పుడు 27 జిల్లాగా రంపచోడవరంను ప్రకటించే అవకాశం ఉందని అధికార వర్గాల నుండి అందుతున్న సమాచారం అని మంత్రి పర్నెనీ నాని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: