పవన్ ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తా : ద్వారంపూడి

Purushottham Vinay
జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసిన ఒక్క ప్రకటన ఇంకా వైసీపీ నాయకులలో నిప్పు రాజేస్తూనే ఉన్నట్లుగా స్పష్టంగా కనపడుతోంది. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ పేరును పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించిన వైనం తెలిసిందే.తమకు అధికారం ఉందనే అహంకారంతో జనసేన నేతల మీద ఇంకా వీర మహిళల మీద చేసిన దాడులను గుర్తు చేస్తూ ద్వారంపూడికి రానున్న ఎన్నికలలో 'జనసేన' సత్తా ఏంటో చూపిస్తామన్న కామెంట్స్ పై ద్వారంపూడి తాజాగా తీవ్రంగా స్పందించారు.రానున్న ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఎక్కడ నుండి పోటీ చేసినా, అక్కడ తానే ఇంచార్జ్ బాధ్యతలు తీసుకుని పవన్ కళ్యాణ్ ను ఓడించి తీరుతా అంటూ సవాల్ విసిరారు ద్వారంపూడి. జనసేన నేతలను ఇంకా కార్యకర్తలను కూడా పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారని, వారిని అడ్డం పెట్టుకొని టీడీపీ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకు రావడానికే పవన్ కళ్యాణ్ ఈ పొత్తుల డ్రామా మొదలు పెట్టారని ఇక ఇందులో రాష్ట్ర శ్రేయస్సుని కాదు చంద్రబాబు శ్రేయస్సుని పరిగణలోకి తీసుకున్నారని త్వరలోనే ఈ విషయం జనసేన కార్యకర్తలు కూడా అర్ధం అవుతుందని ద్వారంపూడి జనసేన పార్టీపై ఇంకా పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు.




ద్వారంపూడి కామెంట్స్ కి ఈ సారి జనసేన నాయకులు గట్టిగానే బదులిచ్చారు. నీకు ఇంత అహంకారామా ద్వారంపూడి? పవన్ కళ్యాణ్ ను ఓడించండం సంగతి పక్కనుంచితే ఫస్ట్ నువ్వు గెలిచి చూపించు? వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ను విమర్శించడం మీద పెట్టిన శ్రద్ధలో ఒక్క శాతం అయినా కూడా కాకినాడ నియోజకవర్గ అభివృద్ధిలో పెట్టుంటే నిన్ను ఎన్నుకున్న ప్రజలకు చాలా మేలు జరిగేదని నాదెండ్ల మనోహర్ కూడా అంతే స్థాయిలో మండిపడ్డారు.అభివృద్ధిని పక్క దారి పట్టించి జనసేన పార్టీ నేతలపై ఇంకా మహిళలపై కులాల పేరుతో దూషణలు చేయడం మీకు తగునా? ఒకరిని ఓడించడం ఇంకా గెలిపించడం మీ చేతులలోనే ఉంటే 2014 ఎన్నికలలో అంత భారీ తేడాతో మీరు ఎందుకు ఓడిపోయారో చెప్పాలని జనసేన నేతలు ద్వారంపూడిని బాగా నిలదీస్తున్నారు. ప్రస్వామ్యంలో గెలుపు ఇంకా ఓటమి రెండిటిని సమాన దృష్టి తో చూడగలిగిన వాడే నిజమైన నాయకుడు అవుతాడని, ఇక ఆ విషయం ఈ వైసీపీ నాయకులు ఖచ్చితంగా తెలుసుకోవాలని జనసైనికులు ద్వారంపూడికి కౌంటర్లు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: