విద్యార్థులకు షాక్... "జగనన్న విద్యా దీవెన" వాయిదా?
అయితే ఇంతకు పాద యాత్రలో జగన్ గమనించిన ఒక సమస్యకు పరిష్కారమే ఈ పధకం. దీని వలన ఎందరో పేద విద్యార్థులు లాభ పడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా జరిగిన విద్యా సంవత్సరం కోసం ప్రభుత్వం ఫీజులను ఇవ్వాల్సి ఉంది. అయితే ఇందు కోసం వాస్తవంగా ఈ రోజున విద్యా దీవెన డబ్బులు తల్లుల ఖాతాలలో వేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ విషయం గురించి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పుడు తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ జగన్నన విద్యా దీవెన ను ఈసారికి వాయిదా వేస్తున్నట్లుగా చెప్పి విద్యార్థులకు షాక్ ఇచ్చింది. ఈ విషయం తెలిసిన విద్యార్థుల తల్లితండ్రులు కూడా నిరాశకు గురయ్యారు.
కానీ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడం వలన విజయవాడలో ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం లో ఏర్పాటు చేసిన ఒక ప్రభుత్వ కార్యక్రమానికి అటెండ్ కావాల్సి ఉండడంతో అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకే ఈ రోజు విద్యా దీవెన వాయిదా పడింది. అయితే తర్వాత ఎప్పుడూ విద్యా దీవెన అమలు కానుంది అనే విషయం త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని ప్రభుత్వం తెలియచేసింది.