ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం ?
అమరావతి : ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీ అధికార భాషా చట్టం 1966కు సవరణకు ఆమోదం తెలిపింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కేబినెట్. ఉర్దూను రెండో భాష గా గుర్తిస్తూ చట్ట సవరణ చేస్తూ.. 35 అజెండా అంశాలపై చర్చ జరిపింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కేబినెట్. విదేశీ మద్యం నియంత్రణ చట్ట సవరణకు ఆమోద ముద్ర వేసింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కేబినెట్. నిజాం పట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం పై అంగీకారంతో పాటు.. టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకం కోసం హిందు ధార్మిక సంస్థల చట్ట సవరణకు ఆమోదం తెలిపింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కేబినెట్. మచిలీపట్నం,భావనపాడు, రామాయపట్నం పోర్టుల నిర్మాణం కోసం రూ. 8741 కోట్ల రుణ సమీకరణకు ఏపీ మారిటైమ్ బోర్డుకు హామీ ఉండేందుకు ఆమోదం తెలిపింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కేబినెట్. ఖాయిలా పడిన చక్కెర కర్మాగారాల్లోని ఉద్యోగులకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ అంశానికి కేబినెట్ ఆమోదం తెలిపింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కేబినెట్.