ఉద్యోగుల అటెండెన్స్ పై ఇక ఆ నిబంధనలు తప్పనిసరి..

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల అటెండెన్స్ పై ఏపీ ప్రభుత్వం సంచలన ఆదేశాలు చేసింది. అలాగే నిబంధనలు తీసుకొని వాటిని తప్పనిసరి చేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..ప్రభుత్వ ఉద్యోగుల అటెండెన్స్ పై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సచివాలయంలో ఉద్యోగులందరి బయోమెట్రిక్ హజరును కూడా ఇక తప్పని సరిచేసింది. ఇప్పటికే బయోమెట్రిక్ హజరుపై సాధారణ పరిపాలన శాఖ మెమో జారీ చేయడం జరిగింది.ఇక మరోసారి తాజాగా ఉద్యోగుల బయోమెట్రిక్ హజరుపై జీఎడీ మెమో జారీ చేయడం జరిగింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా కూడా వివిధ ప్రభుత్వ విభాగాలు, హెచ్ఓడీలు, జిల్లా కలెక్టర్లు ఇంకా అలాగే ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగుల హాజరు వివరాలను నియంత్రణలోకి తెచ్చుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ సచివాలయంలో పనిచేస్తున్న కార్యదర్శులకు సూచనలు జారీ చేయడం జరిగింది.ఇక బయోమెట్రిక్ ద్వారా నమోదైన ఉద్యోగుల హాజరును ఎప్పటికప్పుడు గమనించాలని అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది.ఇక సచివాలయంలోని ఉద్యోగుల హాజరు నమోదు వివరాలు రోజువారీగా సంబంధిత శాఖ కార్యదర్శి పరిశీలించాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ సూచించడం జరిగింది. 


అలాగే ఏపీ సచివాలయంలో 10 శాతం మంది ఉద్యోగులు ఉదయం 11 గంటల తర్వాతే విధులకు హాజరవుతున్నట్టు గుర్తించినట్టు ప్రభుత్వం పేర్కొనడం జరిగింది.ఇక సచివాలయంలోని అన్ని విభాగాల్లో కూడా 80 శాతం హాజరు తప్పనిసరిగా ఉండేలా చూడాలని ఆయా శాఖల కార్యదర్శులను ఆదేశించడం జరిగింది.ఇక ఈ అంశంపై గతంలో జారీ చేసిన నిబంధనల్ని తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం స్ఫష్టం చేయడం జరిగింది. ఇక ఉద్యోగ విరమణ చేసిన, ట్రాన్స్ఫర్ అయిన ఉద్యోగులకు సంబంధించిన వివరాలను బయోమెట్రిక్ పరికరాల నుంచి తొలగించాలని సూచించడం జరిగింది.ఇక బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదుకు నెలవారీగా నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని.. అలాగే ప్రతీశాఖ కూడా కార్యదర్శి ఉద్యోగుల హాజరును బయోమెట్రిక్ ద్వారా పరిశీలించాలని పేర్కొనడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: