18 ఏళ్ళకే ఓటు హక్కు ఆయన పుణ్యమేనా...?

Sahithya
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నారు. ఈ క్రమంలో వారు చేస్తున్న విమర్శలు సంచలనం అవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ అగ్ర నేత వీరప్ప మొయిలీ కీలక వ్యాఖ్యలు చేసారు. దేశంలోనే కాదు ప్రపంచలోనే యువ నాయకుడిగా వున్నారు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కు కల్పించిన నేత అని గుర్తు చేసారు. మహాత్మా గాంధీ కూడా దేశం కోసం బలయ్యారు అని పేర్కొన్నారు ఆయన. యువ ప్రధానిగా వున్న రాజీవ్ దేశం కోసం ప్రాణాలు అర్పించారు అని తెలిపారు.
ఈదేశం కోసం ప్రాణత్యాగాలు.. చేసిన రాజీవ్, ఇందిరా లను మరవలెం అని అన్నారు. అస్సాం, త్రిపురా, తమిళ నాడు  సమస్యలతో కొట్టు మిట్టాడుతుంటే.. వారి సమస్యలను సాలువ్ చేసిండు రాజీవ్ అని వీరప్ప మొయిలీ కొనియాడారు. దేశ సమగ్రతను ఐక్యతను కాపాడేందుకు.. అనేక మంది జాతీయ నాయకులు.. వాళ్ల ప్రాణాలను త్యాగం చేశారు అని గుర్తు చేసుకున్నారు. నేడు మళ్లీ సంతోషంగా ఉన్నామంటే.. ఆ మహనీయుల త్యాగ ఫలితమే అన్నారు ఆయన. రాజీవ్ గాంధీ ఐదేండ్ల పరిపాలన ఒక్క స్వర్ణయుగం అని ఆయన తెలిపారు.
అభివృద్ది, ఐక్యత, శాంతి,  మత సామరస్యం.. అన్ని కాపాడుతూ.. రాజీవ్ పాలన చేశారని గుర్తు చేసారు. దేశంలో అవినీతి నిర్మూలించేందుకు.. అవినీతి నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు అని ప్రస్తావించారు. రాజకీయాల్లో విలువలను పెంచేందుకు ఆంటీడిఫెక్షన్ యాక్ట్ తీసుకొచ్చారు అని వివరించారు. నేడు మోడీ పాలన ప్రజాప్రతినిధులకు రెట్లు పెట్టి కొంటున్నారు అని అన్నారు. అవినీతి నిర్మూలించేందుకు యుపిఎ పాలనలో లోక్ పాల్ బిల్లును తీసుకొస్తే.. దాన్ని అమలు చేయడం లో మోడీ ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. లోక్ పాల్ కావాలని కోట్లాడిన.. సంతోష్ హెగ్డే , అన్నా హజారే లు ఎక్కడ పోయారు అని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: