రెండేళ్ల క్రితం ఇద్దరు కుమార్తెలు చనిపోయిన రోజే.. కవలలు జననం!

Veldandi Saikiran
మన విశ్వంలో అనేక వింతలు చోటు చేసుకుంటాయి. ఇప్పటి వరకూ ఎన్నో రకాల వింతలను మనం చూశాం.  అయితే వీటన్నిటి వెనుక దేవుడు ఉన్నాడని కొందరు నమ్ముతారు. కొందరేమో జన్యు లోపాలు.. ఇంక వేరే సైంటిఫిక్ రీజన్స్ చెపుతూ ఉంటారు. ఏది ఏమైనా భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని ఎక్కువ మంది నమ్ముతుంటారు.  ఇందులో ఎక్కువగా మన భారతీయులే ఉంటారు. అయితే అసలు విషయం లోకి వస్తే... రెండు సంవత్సరాలు కిందట సరిగ్గా సెప్టెంబర్ 15 వ తేదీన పో ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తమకు ఉన్న ఇద్దరు ఆడబిడ్డలను... కోల్పోయింది ఓ కుటుంబం. ఉన్న ఇద్దరు ఆడబిడ్డలను ఓ పడవ ప్రమాదంలో కోల్పోయి ఆ కుటుంబం విషాద చాయ్ లోకి వెళ్ళింది. 

అయితే భగవంతుని అనుగ్రహమో లేక ప్రకృతి సహకరించిoదో తెలియదు కానీ... ఆ ఇంట నవ్వుల పంట పండింది. సరిగ్గా రెండేళ్ల తర్వాత ఆ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు.  మరణ ఘోష చవి చూసిన ఆ తల్లి కడుపునే ఈ ఇద్దరు ఆడపిల్లలు పుట్టడం గమనార్హం.... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం లో ఈ అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే...  సరిగ్గా 2019 సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన గోదావరి నదిలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ఘోర పడవ ప్రమాదంలో ఏకంగా 50 మంది వ్యక్తులు మృతి చెందారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ గోదావరి నది చిదిమేసింది. 

అయితే ఈ మరణించిన వారిలో విశాఖ పట్టణానికి చెందిన ఓ కుటుంబంలోని ఇద్దరు ఆడ పిల్లలు కూడా ఉండటం గమనార్హం. ఆ ఇద్దరు పిల్లలు కూడా ఆడపిల్లలే కావడం అందరినీ కలిచి వేసే అంశం.  దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. లేక లేక పుట్టిన ఇద్దరు పిల్లలు గోదావరి నదిలో చనిపోవడం ఆ కుటుంబాన్ని చిదిమేసింది ఈ సంఘటన. అయితే సరిగ్గా రెండేళ్ల తర్వాత అంటే సెప్టెంబర్ 15వ తేదీనే ఇద్దరు కవల పిల్లలు పుట్టారు ఆ దంపతులకు. అంతే కాదండి ఆ ఇద్దరు పిల్లలు కూడా ఆడ పిల్లలు కావడం కొస మెరుపు. ఇద్దరు ఆడపిల్లలు జన్మించడంతో ఆ తల్లి... సంతోషం ఆకాశానికి అంటింది.  అంతే కాదు ఆ కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: