వైఎస్ జగన్‌కు కానుకగా బాలాపూర్ గణేశుడి లడ్డూ.. !

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్రం లో ఎంతో ఘనం గా జరుగుతాయి గణేష్‌ నిమజ్జన ఉత్సవాలు.  అందులో హైదరాబాద్‌ నగరం లో జరిగే... గణేష్‌ నిమజ్జన ఉత్సవాల గురించి ప్రత్యేకం గా  చెప్పనక్కర్లేదు. అయితే... ఈ గణపతి నిమజ్జన వేడుకల్లో...  గణపతి లడ్డుకు ఉన్న క్రేజ్‌... మాములు గా ఉండదు. ముఖ్యం గా బాలాపూర్‌ గణేశుడి...లడ్డు మరింత స్పెషల్‌.  ప్రతి ఏటా ఈ లడ్డు భారీ ధర పలుకుతోంది.   ఈ సారి కూడా భారీగా పలికింది బాలాపూర్‌ లడ్డూ ధర.  

ఈ వేలం పాట లో చాలా మంది పోటా పోటాగా  పాల్గొన్నారు భక్తులు.  

అయితే... ఈ వేలం పాటలో కడప జిల్లా ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్ తో కలిసి...  నాదల్‌ గుల్‌ వాసి మర్రి శశాంక్‌ రెడ్డి పాల్గొన్నారు.  ఈ నేపథ్యం లో బాలాపూర్‌ వినాయకుడి లడ్డూను ఏకంగా... రూ. 18.90 లక్షల కు దక్కించుకున్నారు  ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్ బృందం.  ఇక బాలాపూర్‌ ప్రధాన కూడలి లో జరిగిన ఈ వేలం పాట లో తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి  మరియు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  అయితే... 2019 సంవత్సరం లో బాలా పూర్‌ లడ్డూను దక్కించుకున్న కొలను రాం రెడ్డి కూడా ఈ సారి వేలం పాటకు హాజరు కావడం గమనార్హం.  

ఆ సంవత్సరం...   కొలను రాం రెడ్డి... బాలా పూర్‌ లడ్డూ ను ఏకంగా రూ. 17. 60 లక్షలకు దక్కించుకున్నారు.  అయితే.. గతేడాది కరోనా మహమ్మరి ఉన్న నేపథ్యం లో బాలాపూర్‌ లడ్డూ వేలం పాట నిర్వహించలేదు.  ఇక ఈ సంవత్సరం లడ్డూ కోసం విపరీతం గా పోటీ పడ్డారు. ఈ నేపథ్యం లోనే బాలాపూర్‌ వినాయకుడి లడ్డూను ఏకంగా... రూ. 18.90 లక్షల కు దక్కించుకున్నారు  ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్ బృందం. ఇక గెలుచుకున్న బాలా పూర్‌ లడ్డూను ఏపీ సీఎం జగన్‌ కు బహుమతి గా ఇస్తానని శశాంక్‌ రెడ్డి స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: