తాలిబన్లకు వణుకు పుట్టిస్తున్న అమృల్లా స్టేట్మెంట్?

praveen
అరాచకాలు సృష్టించి ఆఫ్ఘనిస్థాన్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లకు అటు దేశాధ్యక్షుడు సైతం భయపడి పారిపోయిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో ఇక ఆప్ఘనిస్థాన్లో తమకు అడ్డు అదుపూ లేదు అనుకొని తాలిబన్లు అనుకున్నారు. కానీ అనుకోని విధంగా  అమృల్లా సలేహ్ అనే వ్యక్తి తెర మీదికి వచ్చాడు. అప్పటి వరకు దేశ అధ్యక్షుడిగా ఘని కొనసాగిన సమయంలో అసలు పాలనాపరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకోని అమృల్లా సాలెహ్..  ప్రజలకు రక్షణ కల్పించాల్సిన దేశ అధ్యక్షుడు దేశం విడిచి పారి పోవడం తో.. ఇక ప్రజల రక్షణ బాధ్యతను తన భుజాలమీద వేసుకున్నాడు.


 ఒకరకంగా తాలిబాన్లకు అమృల్లా సాలెహ్ వణుకు పుట్టిస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆఫ్గనిస్తాన్ దేశాన్ని మొత్తం స్వాధీనం చేసుకున్నారు తాలిబాన్లు..  ఇక మరికొన్ని రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఆఫ్ఘనిస్తాన్లోని పంజ్ షేర్ ప్రాంతం మాత్రం ఇప్పటివరకు తాలిబన్ల వశం కాలేకపోయింది. ఇక ఆ ప్రాంతంలో అమృల్లా సాలెహ్ ఆధ్వర్యంలో ఎంతోమంది ఆఫ్ఘనిస్తాన్ సైనికులు తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఒకరకంగా యుద్ధమే చేస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఇటీవలే తాలిబన్లు ఏకంగా పంజ్ షేర్ ప్రాంతం పై యుద్ధం చేయడం మొదలుపెట్టారు. దీంతో ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితి హాట్హాట్గా మారిపోయింది. అయితే ఇక అటు తిరుగుబాటుదారులు ఇటు తాలిబన్ల లో కూడా భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది అన్న విషయం మాత్రం తెలుస్తుంది. అయితే ఇటీవలే  తాము పంజ్ షేర్  ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాము అంటూ తాలిబన్లు ప్రకటించి సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ అటు వెంటనే అమృల్లా సాలెహ్ చేసిన ప్రకటన మాత్రం సంచలనం గానే మారిపోయింది అని చెప్పాలి. నా తలలోకి రెండు బుల్లెట్లు పంపించిన తర్వాత పంజ్ షేర్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోండి.  గొంతులో ప్రాణం ఉన్నంత సేపు పోరాడుతూనే ఉంటామ్ అంటూ అమృల్లా సాలెహ్ స్టేట్మెంట్  తాలిబన్ల లో వణుకు పుట్టిస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: