పత్తా లేని ఆర్ఎస్ ప్రవీణ్ .. ఇలాగైతే ఎలా బాసూ..?
ఈ స్వేరోస్ ద్వారా ఆయన లక్షల సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందుకే ఆయన తొలిసారి బీఎస్పీలో చేరుతూ నల్గొండలో నిర్వహించిన సభ బ్రహ్మాండంగా సక్సస్ అయ్యింది. చాలా మంది ఆ స్థాయిలో సభ పెడతారని.. అంతగా జనం వస్తారని ఊహించలేదు. అయితే ఆరంభం బాగానే ఉంది.. మరి ఆ తర్వాత.. రాజకీయాల్లో చేరాక.. ఓ లక్ష్యం ఏర్పాటు చేసుకున్నాక.. నిత్యం ప్రజలతో మమేకం కావాలి.. ఏదో ఒక కార్యక్రమం నిర్వహించాలి.. మీడియాలోనూ కనిపిస్తుండాలి. అప్పుడే పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది.
కానీ.. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్.. తొలి సభ తర్వాత మళ్లీ ఇప్పటి వరకూ చెప్పుకోదగ్గ కార్యక్రమం ఏదీ నిర్వహించలేదు. అయితే ఆయన నల్గొండ సభ తర్వాత కరోనా బారిన పడినట్టు తెలిపారు. స్వల్ప లక్షణాలే ఉన్నట్టు చెప్పారు. మొత్తానికి తొలి సభ తర్వాత మళ్లీ ప్రవీణ్ కుమార్ మీడియాలో కనపించలేదు. బహుశా ఆయన తన ప్రణాళికలు తాను సిద్దం చేసుకోవచ్చు.. కానీ.. ఈ సోషల్ మీడియా కాలంలో ఇంతకాలం కనిపించకుండా ఉండటం కూడా సరైంది కాదు. కరోనా కారణాలతో జనం మధ్యకు రాలేక పోయినా.. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినా వాడుకోవచ్చు. తెలంగాణ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతున్న కాలంలో ఇలా సైలంట్గా ఉండటం అంత మంచిది కాదని ప్రవీణ్ కుమార్ గుర్తించాలి.