వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?
ప్రతి ఒక్కరి ఫోన్ లోనూ ఇదే పాట మారు మోగుతోంది. ఈ నేపథ్యం లోనే ''బుల్లెట్ బండి'' పాటకు ఓ నర్స్ స్టెప్పులు వేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళ పల్లి పి హెచ్ సి లో... బుల్లెట్ బండి పాట పై రజిత అనే కాంట్రాక్ట్ నర్సు డాన్స్ చేసింది. ఆస్పత్రి ప్రాంగణం లో నర్సు రజిత డాన్స్ చేసింది. రజిత చేసిన డాన్స్ కు తోటి నర్సులు ప్రోత్సహించారు. చాలా బాగా చేస్తుందంటూ... చప్పట్లు కొట్టి మరీ... నర్సు రజితపై ప్రశంసలు కురిపించారు. అటు నర్సు రజిత చేసిన బుల్లెట్ బండి పాట కూడా ఇవాళ ఉదయం నుంచి సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది.
నర్సు చేసిన... డాన్స్ కు నెటిజన్లు కూడా ఫిదా అయిపోతున్నారు. చాలా బ్రహ్మండంగా చేసిందని కామెంట్లు పెడుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. ఈ బుల్లెట్ సాంగ్ ఆ నర్సు రజిత కొంప ముంచేలా కనిపిస్తోంది. ఆస్పత్రి ప్రాంగణం లో నర్సు రజిత చేసిన డాన్స్ పై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి ప్రాంగణం లో డాన్స్లు ఏంటని సీరియస్ అయ్యారు కలెక్టర్. అంతే కాదు.. ఈ వ్యవహారం పై విచారణకు ఆదేశించారు కలెక్టర్ కృష్ణ భాస్కర్. ఈ మేరకు మెమో జారీ చేశారు జిల్లా వైద్యాధికారి సుమన్ రావు. విచారణ అనంతరం నర్సు రజిత పై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.