జ‌గ‌న్ ఆ నేత‌కు తెలివిగా చెక్ పెట్టేశారు..!

frame జ‌గ‌న్ ఆ నేత‌కు తెలివిగా చెక్ పెట్టేశారు..!

VUYYURU SUBHASH
జూపూడి ప్ర‌భాక‌ర్ రావు వైసీపీలో 2014 ఎన్నిక‌ల‌కు ముందు ఎస్సీ వ‌ర్గం నేత‌ల్లో కీల‌క నేత‌గా ఉన్నారు. వైసీపీ మేనిఫెస్టో రూప‌క‌ల్ప‌న‌లో కూడా ఆయ‌న కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. జ‌గ‌న్ ఆయ‌న‌కు ఎంతో ప్ర‌యార్టీ ఇచ్చారు. అయితే 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న ప్ర‌కాశం జిల్లాలోని కొండపి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఆయ‌న ఓటిమికి ప్ర‌స్తుత మంత్రి బాలినేనితో పాటు టీటీడీ చైర్మ‌న్ వైవి. సుబ్బారెడ్డే అని జూపూడి స్వ‌యంగా చెప్పారు. వాయిస్ ఉన్న తాను ఎదిగితే వారికి ఇబ్బంది అని వారిద్ద‌రే త‌న‌ను క‌క్ష క‌ట్టి ఓడించార‌ని ఆయ‌న వాపోయారు. త‌ర్వాత టీడీపీ అధికారంలోకి రావ‌డంతో ఆయ‌న గోడ దూకేశారు. వెంట‌నే చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చి గౌరవించారు. టీడీపీలో ఉండ‌గా వైసీపీని , జ‌గ‌న్‌ను తీవ్రంగా విమ‌ర్శించారు. ఇక గత ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడంతో జూపూడి తిరిగి వైసీపీ గూటికి జంప్ చేసేశారు.

జూపూడిని జ‌గ‌న్ పార్టీలో చేర్చుకునేట‌ప్పుడు ఆయ‌న‌కు ఏదో ప‌ద‌వి ఇస్తానని అయితే హామీ ఇవ్వ‌లేదు. అయితే అలాంటి వ్య‌క్తి మ‌న‌కు ప్ల‌స్ కాక‌పోయినా.. టీడీపీకి ప్ల‌స్ కాకూడ‌ద‌నే జ‌గ‌న్ ఆయ‌న‌కు పార్టీ కండువా క‌ప్పేశారు. ఇక వైసీపీలోకి జూపూడి రీ ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టి నుంచి ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాలు మారిపోయాయి. ఇక్క‌డ సుబ్బారెడ్డి వ‌ర్సెస్ బాలినేని పోరులో జూపూడి కొత్త రాజ‌కీయం స్టార్ట్ చేశారు. ఎవరో ఒక‌రు త‌న‌కు ఎమ్మెల్సీ లేదా కొండ‌పి ఇన్‌చార్జ్ ప‌ద‌వి ఇప్పిస్తార‌ని ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే ఈ రెండు ప‌ద‌వులు కూడా జూపూడికి రాలేదు. చివ‌ర‌కు కొండ‌పి వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న మాదాసి వెంక‌య్య‌నే జ‌గ‌న్ కొన‌సాగించ‌డంతో పాటు ఆయ‌న‌కు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ప్ర‌కాశం డీసీసీబీ చైర్మ‌న్ ప‌ద‌వి కూడా క‌ట్టబెట్టారు.

జూపూడి ఏ ప‌ద‌వి వ‌స్తుందా ? అని ఎక్క‌డ వేయాల్సిన రాళ్లు అక్క‌డ వేస్తూనే ఉన్నారు. ఇక తాజా నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీలో జ‌గ‌న్ ఆయ‌న‌కు సామాజిక న్యాయ సలహాదారు ప‌ద‌విని కేటాయించారు. అయితే ఇక్క‌డే ఓ ట్విస్ట్ ఉంది. జూపూడిని ఈ ప‌ద‌వితో స‌రిపెట్టేసుకోమ‌ని జ‌గ‌న్ హింట్ ఇచ్చేశార‌ని వైసీపీ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. పార్టీ మారి తిరిగి పార్టీలోకి వ‌చ్చారు... ఇంత‌క‌న్నా ఎక్కువ ప‌ద‌వి ఇవ్వ‌లేం.. ఎమ్మెల్సీ ఇవ్వ‌డం కుద‌ర‌ని జ‌గ‌న్ సంకేతాలు ఇచ్చేసిన‌ట్టే క‌నిపిస్తోంది.

ఇక ప్ర‌కాశం జిల్లాలో మూడు రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వీటిల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా కొండ‌పి సీటు ద‌క్కించుకోవాల‌ని ఆయ‌న విశ్వ‌ప్రయ‌త్నాలు చేస్తున్నారు. మ‌రోవైపు ఈ లోగా ఎమ్మెల్సీ ప‌ద‌వి రాదా ? అని ఆ దిశ‌గా కూడా ట్ర‌య‌ల్స్ వేస్తున్నారు. అయితే జ‌గ‌న్ ఆయ‌న‌కు చిన్న నామినేటెడ్ ప‌ద‌వి ఇవ్వ‌డం ద్వారా ఆ ఛాన్స్ నీకు లేద‌ని చెప్ప‌క‌నే చెప్పేశారు. ఇక జూపూడి ఈ ప‌ద‌వితోనే స‌రిపెట్టుకోవ‌డం మిన‌హా చేసేదేం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: