విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు?
ఇక సాఫీగా సాగిపోతున్న చదువులను తలకిందులు చేసింది కరోనా వైరస్. ఈ క్రమంలోనే ఆన్లైన్ క్లాసులతో అందరూ ఇంటిపట్టునే చదువుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రతి ఒక్కరికి విద్య అనేది చేరువ కావడం లేదు అంతే కాదు ఇలాంటి పరీక్షలు లేకుండానే అటు ప్రభుత్వాలు విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేస్తూ ఉండటం కూడా అటు విద్యార్థులలో సృజనాత్మకతను తగ్గిస్తుంది అని విశ్లేషకులు అంటున్న మాట. ఇకపోతే ప్రస్తుతం సెకెండ్ వేవ్ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో తగ్గుతుంది. ఈ క్రమంలోనే మళ్ళీ విద్యా సంస్థలను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణ మొదలుపెట్టాయి.
అయితే 2021 - 22 విద్యాసంవత్సరం ప్రారంభించేందుకు నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం ఈ క్రమంలోనే ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ లపై ఇటీవల జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియను ప్రత్యక్షంగా కాకుండా ఆన్లైన్లోనే నిర్వహించాలి అని ఏపీ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలోనే దీనికి సంబంధించి అన్ని ప్రణాళికలను సిద్ధం చేసింది ఏపీ విద్యాశాఖ. ఇక మెరిట్ ప్రాతిపదికన విద్యార్థులు కోరుకున్న కాలేజీ గ్రూపులో సీట్ పొందేలా ఏపీ విద్యాశాఖ ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎస్సీ,ఎస్టీ,బిసి, పి హెచ్ మహిళలకు ఇక అటు రిజర్వేషన్లు కూడా అమలయ్యేలా చూడనుంది ఏపీ విద్యాశాఖ. అయితే ఏపీ ప్రభుత్వం గత ఏడాది ఈ ప్రక్రియను తీసుకు వచ్చినప్పటికీ దీనిని నిరసిస్తూ అటు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించడంతో ఇది కాస్త నిలిచిపోయింది. కానీ ప్రస్తుతం మాత్రం అమలు కానున్నట్లు తెలుస్తోంది.