డజను మమూలు మామిడి పండ్లు రూ.1.2 లక్షలకు కొన్నాడు.. ఎందుకంటే..?
ఇలా కొనడం వెనుక ఓ కథ ఉంది. ఆ మామిడి పండ్లు అమ్ముతోంది ఓ బాలిక. ఆమె ఓ విద్యార్థిని లాక్డౌన్ సమయంలో ఆన్ లైన్ క్లాసులు వినేందుకు స్మార్ట్ ఫోన్ లేదు. అందుకే ఫోన్ కొనుక్కునేందుకు ఇలా రోడ్డు పక్కన మామిడి పండ్లు అమ్ముతోంది. ఆ విషయం ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దాన్ని వ్యాపారవేత్త హమేయా హెటె చూశాడు. ఆ బాలికకు సాయం చేయాలనుకున్నాడు. అంతే వెంటనే రోడ్డు పక్కన మామిడిపండ్లు అమ్ముతున్న బాలిక దగ్గరకు కారులో వచ్చాడు.
అందులోంచి దిగిన హమేయా ఒక్కో మామిడిపండు రూ.10 వేలకు కొంటున్నట్లు చెప్పాడు. ఆ బాలిక ఆశ్చర్యం నుంచి తేరుకునేలోపే మొత్తం పన్నెండు పండ్లకు రూ.1.2 లక్షలకు కొనేశాడు. ఆ మొత్తాన్ని ఆ బాలిక తండ్రి శ్రీమర్ కుమార్ బ్యాంకు అకౌంట్కు బదిలీ చేశాడు. ఇదంతా జరిగింది ఝార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్పుర్లో. ఆ బాలిక పేరు తులసి కుమారి. ఈ బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో అయిదో తరగతి చదువుతోంది.
హమేయా హెటె చేసిన ఈ సాయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ డబ్బుతో తులసి ఓ స్మార్ట్ ఫోన్ కొనుక్కుని ఆన్లైన్ తరగతులకు హాజరవుతోంది. తాను అమ్మే మామిడి పండ్లతో ఆ స్మార్ట్ ఫోన్తో ఓ ఫోటో దిగి సోషల్ మీడియాలో ఉంచింది. ఇప్పుడు ఇది బాగా వైరల్ అవుతోంది.