రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పిన టీడీపీ ఫ్యామిలీ ?

VUYYURU SUBHASH
130 సంవ‌త్స‌రాల సుధీర్ఘ‌మైన రాజ‌కీయ చ‌రిత్ర ఉన్న మాగంటి బాబు ఫ్యామిలీ రాజ‌కీయాల‌కు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా రాజ‌కీయాల్లోనే కాకుండా తెలుగు రాజ‌కీయాల్లో త‌మ‌దైన ముద్ర వేసుకున్న మాగంటి బాబు ఫ్యామిలీ గ‌తంలో కాంగ్రెస్‌.. ఆ త‌ర్వాత తెలుగుదేశంలో రాజ‌కీయాలు చేసింది. మాగంటి బాబు ఫ్యామిలీకి తెలుగు గ‌డ్డ‌పైనే ఏ కుటుంబానికి లేనంత ఘ‌న‌మైన చ‌రిత్ర ఉంది. వాళ్ల తాత నుంచి వారు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన‌డంతో పాటు ఆ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘ కాలంగా రాజ‌కీయాలు చేశారు. మాగంటి బాబు త‌ల్లి వ‌ర‌ల‌క్ష్మీ దేవి, తండ్రి ర‌వీంద్ర నాథ్ చౌద‌రి ఆ త‌ర్వాత మాగంటి బాబు ఇలా ఒకే ఫ్యామిలీ నుంచి ముగ్గురు మంత్రులుగా చేశారు.

వైఎస్ సీఎంగా ఉన్న‌ప్పుడు చిన్న త‌ర‌హా నీటిపారుదల శాఖా మంత్రిగా ఉన్న మాగంటి బాబును ఓ జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో పార్టీ ఓడినందుకు రాజ‌శేఖ‌ర్ రెడ్డి రాజీనామా చేయించారు. వైఎస్ మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయించ‌డంతో తీవ్ర అవ‌మానంగా భావించిన మాగంటి 2009 ఎన్నిక‌ల వేళ టీడీపీలోకి జంప్ చేసి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నిక‌ల్లో మాగంటి టీడీపీ ఎంపీగా విజ‌యం సాధించారు. గ‌త ఎన్నిక‌ల్లో సిట్టింగ్ ఎంపీ హోదాలో ఘోరంగా ఓడిన ఆయ‌న ఇప్పుడు తీవ్ర ఆవేద‌న‌లో ఉన్నారు.

మాగంటి రాజ‌కీయ వార‌సుడిగా ఉన్న మాగంటి రాంజీ కొద్ది రోజుల క్రింద‌టే ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఇక ఆయ‌న రెండో కుమారుడు మాగంటి ర‌వీంద్ర‌నాథ్ చౌద‌రి సైతం ఇటీవ‌లే మృతి చెందారు. ఇద్ద‌రు కుమారుల‌ను రెండు నెల‌ల తేడాలో కోల్పోయిన ఆయ‌న తీవ్ర ఆవేద‌న‌లో ఉన్నారు. ఇక వ‌య‌స్సు పై బ‌డ‌డంతో ఆయ‌న ఇక‌పై క్రియాశీల‌క రాజ‌కీయాల్లో ఉండ‌లేన‌ని కూడా చెప్పేస్తున్నారు. దీంతో శ‌తాబ్దాల  చ‌రిత్ర ఉన్న మాగంటి బాబు ఫ్యామిలీ రాజ‌కీయం ఇక ముగిసింద‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: