ఆస్క్ మీ అన్న‌ కేటీఆర్..ఆ ప్ర‌శ్న‌తో షాక్ ఇచ్చిన నెటిజ‌న్.. !

తెలంగాణ‌లో రాజ‌కీయ‌నాయ‌కులు సోష‌ల్ మీడియాను త‌క్కువ‌గా ఉప‌యోగిస్తుంటారు. కానీ మంత్రి టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇక క‌రోనా విజృంభ‌ణ ప్రారంభమైననాటి నుండి కేటీఆర్ దాదాపు రోజంతా ట్విట్ట‌ర్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. స‌హాయం కోరిన‌వారికి వెంట‌నే సాయం చేస్తున్నారు. అయితే తాజాగా నెటిజ‌న్లు కేటీఆర్ కు షాక్ ఇచ్చారు. కేటీఆర్ ఆస్క్ కేటీఆర్ అంటూ నెటిజ‌న్ల‌తో సంభాష‌ణ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించారు. కాగా ఆ కార్య‌క్ర‌మంలో ప‌లువురు నెటిజ‌న్లు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. కానీ కేటీఆర్ మాత్రం కొన్నింటికే స‌మాధానం ఇచ్చారు. 


ప్ర‌స్తుతం క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఎక్కువ ప్ర‌శ్న‌ల‌ను నెటిజ‌న్లు ఆ అంశంపైనే అడిగారు. కాగా ఓ నెటిజ‌న్ మాత్రం కేటీఆర్ కు షాక్ ఇచ్చారు. కేటీఆర్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. అన్నా మీ ప్ర‌భుత్వం త‌రుపున పీహెచ్సీల‌లో కోవిడ్ టెస్టులు చేసే ప‌ద్ధ‌తిని మార్చండి. ల్యాబ్ టెక్నీషియ‌న్ల సంఖ్య‌ను కూడా పెంచండి. 
ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో క‌రోనా టెస్టులు ప్ర‌జ‌లకు ఆస్ప‌త్రులు 24 గంట‌లు స‌ర్వీసులు అందిచేలా చ‌ర్య‌లు తీసుకోండి. ప్ర‌జ‌ల‌ను కాపాడండి. లేక‌పోతే రాజీనామా చేసేయండి. అంటూ నెటిజ‌న్ కేటీఆర్ ను డిమాండ్ చేశారు.


అయితే కేటీఆర్ మాత్రం నెటిజ‌న్ కు ఎలాంటి స‌మాధానం ఇవ్వ‌లేదు. ఇక మ‌రో నెటిజ‌న్ కూడా కేటీఆర్ ను నిల‌దీస్తూ కామెంట్ చేశారు. క‌రోనా ఎన్నిక‌ల‌ప్పుడు రాత్రికి రాత్రే డ‌బ్బులు పంపిణీ చేస్తారు. కానీ క‌రోనా వ‌స్తుంటే మాత్రం రాత్రికి రాత్రి ఎందుకు వ్యాక్సిన్ వేయ‌లేదు అంటూ ప్ర‌శ్నించాడు. ఇక మ‌రో నెటిజ‌న్ మీరు వ్యాక్సిన్ వేసుకున్నారా సార్..? అంటూ ప్ర‌శ్నవేయ‌గా కేటీఆర్ ఇంకా తీసుకోలేద‌ని సమాధానం ఇచ్చారు. ఇక కొంద‌రు కేటీఆర్ అభిమానులు కేటీఆర్ పాల‌న‌ను మెచ్చుకుంటూ కామెంట్లు పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంద‌ని కామెంట్లు పెట్టారు.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: