రానున్న రోజులు అత్యంత కీలకం..!
ఇక మహమ్మారి కట్టడికి వచ్చే 6-18 నెలల సమయం అత్యంత కీలకమని సూచించారు. ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. దేశంలో వెలుగుచూసిన బీ.1.617 వేరియెంట్ తీవ్రమైనదని, వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు. బ్రిటన్లో గుర్తించిన బీ 117 స్ట్రెయిన్ కంటే ఇది ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నదని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న టీకాలు ఈ స్ట్రెయిన్పై సమర్థంగా పనిచేస్తుండటం ఊరట కలిగిస్తున్నదని పేర్కొన్నారు.
అయితే ప్రపంచంలోని కనీసం 30 శాతం మందికి టీకా వేసినట్లయితే మహమ్మారి తీవ్రతను తగ్గించినవారమవుతామని సౌమ్య అభిప్రాయపడ్డారు. దీనిపై స్థానికంగా, విదేశాల్లో జరుగుతున్న అధ్యయనాలను పరిశీలిస్తున్నాం. ఈ స్ట్రెయిన్ జన్యుక్రమాన్ని, మరిన్ని లోతైన వివరాలను తెలుసుకోవాల్సి ఉంది. భవిష్యత్తులో మరిన్ని రకాల కరోనా వైరస్లను, ఆందోళనకర స్ట్రెయిన్లను చూడాల్సి వస్తుంది. వాటి వ్యాప్తిని అరికట్టడం, వ్యాధి తీవ్రతను తగ్గించడం, మరణాలకు అడ్డుకట్ట వేయడం మనముందున్న కర్తవ్యం.
ఇక మన చుట్టూ ఏ వైరస్లు ఉన్నా, మనం ఎక్కడున్నా జాగ్రత్త పడాల్సింది ఒక్కటే. ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వడం, అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇది ఎవరికి వారు వ్యక్తిగతంగా పాటించాల్సిన నియమం తెలిపారు. మాస్కు ధరించాలన్నారు. సామాజిక దూరాన్ని పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ వెల్లడించారు.