ఎక్కువసేపు పని చేస్తే..అధిక ముప్పు..

praveen
దేశవ్యాప్తంగా కరోనావైరస్‌ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో చాలా సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేయమని చెబుతున్నాయి. ఇది ఉద్యోగులకు కొంత సౌకర్యంగా ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ ఇబ్బందులు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంటి నుంచి పని చేసుకునే వెసులుబాటు ఇచ్చినప్పటికీ ఎంత పని జరిగిందనే విషయమై సంస్థలు లెక్కలేసుకుంటాయి. ఇచ్చిన టైంలో పని పూర్తి కాకపోతే పై నుంచి ఒత్తిడి మామూలుగా ఉండదు. ఆఫీసుల్లో అయితే పని చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు ఉంటాయి. అదే ఇంటి దగ్గర నుంచి చేస్తే కుటుంబ సభ్యులు, ఇతరుల నుంచి చిన్నపాటి ఆటంకాలు ఏర్పటడం సహజమే. అంతేకాకుండా ఒకే చోట అలా కూర్చొని పని చేయడం వల్ల తొందరగా అలసిపోతారు. ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశమూ ఉంది. మరోవైపు ఎక్కువ సేపు పనిచేయడం వల్ల అధిక మరణాలు సంభవిస్తున్నాయని, ఆ మరణాలని కరోనా ఇంకా అధికం చేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి చేసింది. జర్నల్ ఇన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ ప్రకారం 2016లో 7,45,000మంది మరణించారు.
ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల వచ్చిన {{RelevantDataTitle}}