వైసీపీ కి ఊహించని షాక్.. ఎన్నికల్లో గెలిచిన వారానికే మహిళా కార్పొరేటర్..?

praveen
ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో మున్సిపల్ ఎన్నికలు జరగడం తో ఎన్నికల వేడి ఎంత రాజుకుందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నికలలో విజయం సాధించడానికి అధికార ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలోనే కసరత్తులు చేశాయి.  అయితే ప్రతి పక్ష పార్టీలు ఎక్కువ స్థానాల్లో గెలుపొందడానికి ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ  చివరికి అధికార పార్టీ సత్తా చాటిన భారీ మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఇటీవలే మున్సిపల్ ఎన్నికల్లో విశాఖ మేయర్ స్థానాన్ని గెలుచుకున్న అధికార వైసీపీ లో అంతలోనే విషాదం చోటు చేసుకుంది.



 విశాఖ పట్నం 61 వ వార్డు నుంచి కార్పొరేటర్గా గెలుపొందింది వైసీపీ అభ్యర్థి సూర్య కుమారి. కాగా ఇటీవలే ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కుటుంబం తో కలిసి పారిశ్రామిక వాడలో నివసించే సూర్య కుమారి ఇక ఆకస్మాత్తుగా మృతి చెందడం అటు కుటుంబ సభ్యులను పార్టీ శ్రేణులను కూడా విషాదం లో ముంచెత్తింది.  మున్సిపల్ ఎన్నికలలో వైసిపి పార్టీ అభ్యర్థి సూర్య కుమారి విజయం సాధించిందని పార్టీ శ్రేణులు అందరూ ఆనంద పడుతున్న సమయంలో  ఆమె మృతి అందరిని షాక్కు గురి చేసింది.



 అయితే ఇక సూర్య కుమారి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పద స్థితిలో ఆకస్మాత్తుగా సూర్యకుమారి మృతి చెందడంతో ఇక అటు పోలీసులు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సూర్యకుమారినీ ఎవరైనా హత్య చేశారా లేదా అనారోగ్యంతో చనిపోయిందా అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇలా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించామని వైసీపీ కార్యకర్తలు సంతోషం లో ఉండగా అంతలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: