పుర పోరు: మదనపల్లెలో కార్పొరేషన్ పీఠం ఆమెదే.. పోల్స్ అదే చెప్తున్నాయా?
పలమనేరు పంచాయతీ 2005లో మున్సిపాలిటీగా ఏర్పాటైంది. పాత పంచాయతీ భవనంలోనే దీనిని కొనసాగించారు. మొదటిసారిగా 2005లో ఎన్నికలు నిర్వహించారు. మహిళలకే కేటాయించడంతో తొలి ఛైర్పర్సన్గా కాంగ్రెస్కు చెందిన నాగమణికపర్థి ఎన్నికయ్యారు.2014లో ఎన్నికలు నిర్వహించగా.. రెండో దఫా కూడా మహిళలకే రిజర్వేషన్ కావడంతో వైకాపాకు చెందిన శారద ఛైర్పర్సన్గా ఎన్నికయ్యారు. పాలకవర్గం 2019 మార్చి నెలాఖరుకు వరకు కొనసాగింది. అప్పట్నుంచి ప్రత్యేక అధికారి పాలనలోనే కొనసాగింది.
ప్రస్తుతం మూడోసారి జరగనున్న ఎన్నికల్లో బీసీ మహిళకు కేటాయించారు. ప్రస్తుతం వైకాపా అభ్యర్థులు 18 వార్డుల్లో ఏకగ్రీవం కాగా.. ఇందులో 9 వార్డుల్లో మహిళలు ఉన్నారు. మరో 8 వార్డుల్లో వైకాపా, తెదేపా, భాజపా, స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉండి గట్టి పోటీని ఇస్తున్నారు.2014లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి తెదేపా అభ్యర్థి కొడవలి శివప్రసాద్ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఈ సారి ఛైర్మన్ పదవి మహిళను వరించనుంది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో పట్టణంలో 35 వార్డులుంటే 18 మహిళలకు రిజర్వేషన్ అయ్యాయి. 15 వార్డులు ఏకగ్రీవం కాగా అందులో 9 మంది మహిళా కౌన్సిలర్లు ఏకగ్రీవమయ్యారు..మొదటిసారి జనరల్ మహిళకు రిజర్వేషన్ ఇచ్చిన నేపథ్యంలో గట్టి పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో ఆమెకే పదవి దక్కుతుందని అభిప్రాయ పడుతున్నారు.. మరి ఎవరి జెండా ఎగురుతుందో చూడాలి..